గుడ్‌న్యూస్‌: విశాఖ, అనంతల్లో లాజిస్టిక్ పార్కులు?

ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్‌ చెప్పింది. విశాఖపట్నం, అనంతపురంలో కేంద్రం మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు అభివృద్ధి చేయబోతోంది. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోం ప్రకాష్ రాజ్యసభలో వెల్లడించారు. రాజ్యసభలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోం ప్రకాష్ ఈమేరకు రాతపూర్వకంగా సమాధానం చెప్పారు.

ఈ  లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు కోసం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ వివిధ రాష్ట్రాల్లో మొత్తం 35 ప్రదేశాలను గుర్తించారు. ఈ మల్టీ మెడల్ లాజిస్టిక్ పార్కులు అభివృద్ధి చేస్తోందని వాటి పనులు వివిధ దశల్లో ఉన్నాయని  కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోం ప్రకాష్ వివరించారు. నేషనల్ లాజిస్టిక్ పాలసీని కేంద్ర కేబినెట్ ఈ ఏడాది సెప్టెంబర్ 21న ఆమోదించిందని  కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోం ప్రకాష్ పేర్కొన్నారు.

దేశంలో లాజిస్టిక్ పార్కులు అభివృద్ధి చేయడం ద్వారా లాజిస్టిక్ సమర్థతను పెంచి వ్యయాన్ని తగ్గించాలన్నదే నేషనల్ లాజిస్టిక్ పాలసీ ముఖ్య ఉద్దేశమని  కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోం ప్రకాష్ చెప్పారు. పూర్తి స్థాయి లాజిస్టిక్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేయడం ద్వారా లాజిస్టిక్ ఖర్చును గణనీయంగా తగ్గించడం కూడా ఈ వ్యూహంలో భాగంగా తెలిపారు. ఇదే ఎన్ ఎల్ పీ-2022 సమగ్ర ఎజెండా అని  కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోం ప్రకాష్ తెలిపారు.

ఆర్థిక వ్యవస్థ సమగ్రాభివృద్ధి కోసం సమర్థవంతమైన లాజిస్టిక్ సెక్టార్ అవసరమని  కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోం ప్రకాష్ అన్నారు. మొత్తం జీడీపీలో లాజిస్టిక్ సెక్టార్ వాటాకు గణనీయమైన భాగం ఉందని మంత్రి తెలిపారు. దీనికి సంబంధించిన  వివరాలు ప్రస్తుతం పూర్తిగా లేకపోయినా.. రైల్వే, రోడ్డు రవాణా, జల రవాణా, వాయు రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్ కాస్టింగ్ సేవలు ఇతర లాజిస్టిక్ సెక్టార్ల జీవీఏ 2018-19లో 1,71,75,128 కోట్లుగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇవే 2019-20 లో 1,83,55,109 కోట్లు, 2020-21లో 1,80,57,810 కోట్లుగా ఉన్నట్టు కేంద్రమంత్రి వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: