భారత్ తో బంధం.. ఆ దేశాల నోరు మూయించిన రష్యా?

ఒకవైపు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం.. మరోవైపు రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలు. ఈ టైంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోడీ భేటీ కావాల్సి ఉంది. కాకపోతే ఆ సమావేశం రద్దు అయినట్లు ఇరు దేశాలు స్పష్టం చేశాయి. వాస్తవానికి గతేడాది అక్టోబరులో పుతిన్ మోడీతో సమావేశమయ్యారు. మరోవైపు జీ 20 సదస్సులో రష్యాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అప్పుడు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం పీక్స్ లో ఉన్న టైం. ఇది యుద్ధాల సమయం కాదు.. శాంతి సమయం అని ప్రధాని మోదీ ఇచ్చిన స్టేట్ మెంట్ ని రష్యా అంగీకరించింది. తాము కూడా శాంతినే కోరుకుంటున్నామన్నారు పుతిన్.

రెండుసార్లు చర్చలు జరిగాక.. మళ్లీ కూర్చుని చర్చించుకునేంత పెద్ద విషయాలు ఏమీ లేవు. అందుకే రష్యాతో భారత్ చర్చలు జరపట్లేదు. ఇంకా లోతుగా చర్చించుకుంటే.. ఇరు దేశాల మధ్య వాణిజ్య విధానాలు బయటకు చెప్పాల్సి వస్తుంది. ఇప్పటికే అన్ని రకాల ఎగుమతులు, దిగుమతులు ఇరు దేశాల మధ్య కొనసాగుతున్నాయి. రష్యా దగ్గర్నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటుంది. రష్యా కూడా భారత్ నుంచి దిగుమతులు చేసుకుంటుంది. మరోవైపు పుతిన్ తో జరగాల్సిన భేటీ రద్దు అవడంతో.. దీన్ని పాశ్చాత్య దేశాలు వక్రీకరించి రాశాయి.

ఉక్రెయిన్ పై అణ్వాయుధాలు వాడుతామని గతంలో రష్యా ప్రకటన చేసింది. రష్యా ప్రకటన చేసినందుకే భారత్ చర్చలు జరపట్లేదని ప్రచారం చేస్తుంది. పాశ్చాత్య దేశాల ప్రచారాన్ని మాత్రం జెలెన్ స్కీ నమ్మట్లేదు. ఉక్రెయిన్ ఎప్పుడూ భారత్ ని శత్రువుగా భావిస్తుందనే విషయం తెలిసిందే. అందుకే పాశ్చాత్య దేశాలు చేస్తున్న ప్రచారాన్ని ఉక్రెయిన్ తేలగ్గా తీసి పారేసింది. అయితే భారత్ పై ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రచారాన్ని ఒక్క ప్రకటనతోనే స్వస్తి చెప్పింది రష్యా. భారత్ తో సంబంధాలు కొనసాగుతున్నాయంది. చర్చల రద్దుపై వస్తున్న వ్యాఖ్యలన్నీ అవాస్తవాలని మీడియా ప్రకటన విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: