2024 ఎన్నికలు అమరావతిపై రిఫరెండమ్ అవుతాయా?
ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలు అమరావతిపై రిఫరెండమ్ అవుతాయంటూ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించడం ఆసక్తి రేపుతోంది. 2024 తో రాజధాని అంశానికి ముగింపు పడుతుందని మంత్రి అమర్నాథ్ అంటున్నారు. అప్పటివరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎన్నికలలో రెఫరెండమ్ అవుతాయని, ఆ ఎన్నికల్లో తీర్పు వైఎస్ ఆర్సీపికి అనుకూలంగా వస్తుందని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ చెప్పారని.. అలాగే రాష్ట్రమంటే ఆ 29 గ్రామాలు కాదోయ్.. రాష్ట్రమంటే 26 జిల్లాలోయ్ అని చంద్రబాబు నాయుడు గుర్తెరగాలని మంత్రి అమర్నాథ్ చురకలు వేశారు.
అమరావతి నుంచి అరసవిల్లి వరకు యాత్ర దేవుని చూడటానికి ఐతే పర్వాలేదని.. మా ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి కాకూడదని మొక్కుతామంటే చూస్తూ ఉరుకోబోమని మంత్రి అమర్నాథ్ అంటున్నారు. పూర్వపు అమరావతి దేవతల ప్రాంతం కావచ్చేమో కానీ ఇప్పుడు అమరావతి మాత్రం దెయ్యాల అమరావతి అంటున్నారు మంత్రి అమర్నాథ్ . శ్రీ కృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఈ ప్రాంతం వెనుకబడి ఉందని నివేదికలో ఇచ్చారని.. ఈ ప్రాంతానికి ఏ రోజు చంద్రబాబు మేలు చెయ్యలేదని మంత్రి అమర్నాథ్ అన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్రకూ.. అమరావతి బిజినెస్ క్లాస్ మనుషులకు జరుగుతున్న పొరాటమిది అంటున్న మంత్రి అమర్నాథ్ .. ఈ ప్రాంతానికి వచ్చి మా కడుపు కొడతామంటే చూస్తూ ఉరుకోడానికి ఇక్కడ ప్రజలు సిద్ధంగా లేరన్నారు.