రాజు మారినప్పుడల్లా రాజధాని మారుతుందా?

రాజధాని రైతుల మహా పాదయాత్రకు జనసేన సంపూర్ణ మద్దతు తెలిపింది. తెనాలిలో మీడియాతో మాట్లాడిన జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్.. పాదయాత్ర జరిగే మార్గాల్లో మా పార్టీ నేతలు సంఘీభావం తెలియజేస్తారన్నారు. ఏపీ రాజధాని అమరావతి మాత్రమేన్న నాదెండ్ల మనోహర్.. రాజు మారినప్పుడల్లా రాజధాని మారదన్నారు. అమరావతి రైతులకు ముందుగా మద్దతు తెలిపింది పవన్ కళ్యాణేనని జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు.

జగన్ ప్రభుత్వం వచ్చాక రైతులు ఎక్కడా సంతోషంగా లేరన్న జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్.. అమరావతి ప్రాంతంలో పవన్ పాదయాత్ర కి కంచెలు వేసి అనేక అడ్డంకులు సృష్టించారని విమర్శించారు. అమరావతి రాజధాని విషయంలో జనసేనపై కొందరు అపోహలు సృష్టించినా... తాము మాత్రం స్పష్టంగా ఉన్నామని జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. గతంలో కూడా అమరావతి రైతుల పాదయాత్రకు   మద్దత్తు తెలిపామని గుర్తు చేసిన జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్.. అమరావతి రైతుల రెండో పాదయాత్ర కు జనసేన  కార్యకర్తలు అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారన్నారు.

రైతుల పాదయాత్రకు కోర్ట్ కి వెళ్లి అనుమతులు తెచ్చుకునే దుస్థితి ఏర్పడిందని జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. తిరుమల పాదయాత్ర చేసినప్పుడు రైతుల పై  కేసులు పెట్టారు, దాడులు చేశారని జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. జగన్ కి అమరావతి రైతులను 10నిమిషాలు కూర్చోబెట్టి మాట్లాడే తీరిక లేదని విమర్శించిన జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్.. జగన్ రాజధాని ప్రాంతాల్లో పరదాలు కట్టుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

జగన్ ప్రభుత్వం కనీసం ఒక రాజధానే కట్టలేదని.. ఇక మూడు రాజధానులు కడతారా అని జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. అమరావతి అభివృద్ధి చెందాలి పెట్టుబడులు వచ్చి ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్లాలని ఆకాంక్షించిన జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్.. రాజధాని రైతుల పోరాటానికి జనసేన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: