జగన్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్.. తేల్చేసిన ఉండవల్లి?
చంద్రబాబు హయాంలో జగన్ ఎలా మాట్లాడారో... ఇప్పుడు జగన్ హయాంలో చంద్రబాబు అలాగే మాట్లాడుతున్నారని ఉండవల్లి కామెంట్ చేశారు. ముఖ్యమంత్రులు మారినా ఏపీ సమస్యలు మాత్రం అలానే ఉన్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని పరిణామాలను చూస్తుంటే ఆందోళన కలుగుతోందని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి మతాన్ని తీసుకొచ్చి వివాదం చేయవద్దని ఉండవల్లి విజ్ఞప్తి చేశారు. చదువుకున్న వాళ్లు కూడా సంకుచితంగా ఆలోచన చేస్తున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇతర పార్టీల్లో పదవులు అనుభవించిన వాళ్లు కూడా బీజేపీ భావజాలం తెలియకుండా అక్కడ కూడా పదవులు కోసమే వెళ్తున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషించారు. వైసీపీ, టీడీపీ, జనసేన బీజేపీకే మద్దతు ఇస్తున్నాయని.. అన్ని రంగాల్లో విఫలమైన భాజపా...మతం విషయంలో మాత్రం విజయం సాధించిందని ఉండవల్లి అరుణ్ కుమార్ అంటున్నారు. 2017 లోనే డయా ఫ్రం వాల్ పోయిందని తాను చెప్పానని ఉండవల్లి గుర్తు చేశారు. పోలవరం కింద 30 వేల కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. కోట్లు ఇవ్వాల్సి వస్తుందనే పోలవరం నిర్మాణానికి కేంద్రం ఆసక్తి చూపడం లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ అంటున్నారు.