కూతురు కూలిని పెళ్లి చేసుకుందని.. తండ్రి ఏం చేసాడో తెలుసా?

praveen
ప్రస్తుతం ప్రతి మనిషి ఆధునిక సమాజంలో అడుగుపెడుతున్నాడు. ఈ క్రమంలోనే  జీవనశైలిలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే మనిషి జీవన శైలి లో ఎన్ని మార్కులు వచ్చిన కులం మతం అనే వివక్ష మాత్రం ఇంకా సభ్యసమాజంలో పోవడం లేదు. ఒకప్పటి రాచరిక పాలనలో జరిగినట్లుగానే నేటి ఆధునిక సమాజంలో కూడా కులం మతం పేరుతో పరువు హత్యలు జరుగుతున్నాయ్ అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కులమతాలకు అతీతంగా పెళ్లి చేసుకున్న ఎన్నో ప్రేమజంటలు  పరువు హత్యలకు గురవుతుండటం వెలుగులోకి వస్తున్నాయి.

 ఇటీవల తమిళనాడులో కూడా ఇలాంటివి దారుణ ఘటన వెలుగులోకి వచ్చి అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. కుమార్తె ఒక దినసరి కూలీ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అని కోపంతో తండ్రి రగిలిపోయాడు. ఈ క్రమంలోనే రక్తం పంచుకుని పుట్టిన కూతురు అని కూడా చూడకుండా దారుణంగా హత్యచేశాడు. అంతటితో ఆగకుండా అల్లుడిని కూడా దారుణంగా నరికి చంపాడు. తమిళనాడులోని ట్యూటికొరిన్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ముత్తుకుట్టి అనే 50 ఏళ్ల వ్యక్తికి కుమార్తె రేష్మ ఉంది. కోవిల్పట్టి లోని ఓ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ఈ ప్రాంతానికి చెందిన దినసరి కూలీ మానిక రాజు ను ప్రేమించింది సదరు బాలిక. అయితే వీరి ప్రేమను మాత్రం తండ్రి అంగీకరించలేదు.

 అయినప్పటికీ అటు పెద్దలను ఎదిరించి వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. దీంతో కూతురు పై ఆగ్రహం తో ఊగిపోయారు తండ్రి ముత్తు కుట్టి. పెళ్లి చేసుకుని  ఇటీవలే గ్రామానికి తిరిగి వచ్చారు ఈ జంట.  వారు గ్రామంలో ఉండేందుకు అనుమతించారు గ్రామ పెద్దలు. కాగా ఇటీవలే కొడవలితో రేష్మ ఇంటికి వెళ్లిన తండ్రి ముత్తుకుట్టి రేష్మ తో పాటు భర్తను కూడా దారుణంగా హత్య చేశాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. ఇక నిందితుడిని పట్టుకొని కటకటాల వెనక్కి తోశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: