భార్యను చంపి శవంతో పడుకున్నాడు.. కానీ ఉదయాన్నే ట్విస్ట్?

praveen
మద్యం మత్తు ఇటీవల కాలంలో ఎన్నో దారుణాలకు కారణం అవుతుంది అనే విషయం తెలిసిందే. మద్యం ఆరోగ్యానికి హానికరం అందరికీ తెలుసు. కానీ నేటి రోజుల్లో మద్యానికి దూరంగా ఉంటున్న వారి సంఖ్య కంటే మరింత దగ్గరగా ఉన్నవారి సంఖ్య పెరిగిపోతోంది. అటు ప్రభుత్వాలు కూడా మందుబాబులను మరింత ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు మద్యం తాగుతున్న వారి సంఖ్య పెరిగి పోతూనే ఉంది అని చెప్పాలి. ఒకప్పుడు ఎవరికైనా కాస్త ఎక్కువగా మద్యం అలవాటు ఉంది అంటే చాలు వారిని విచిత్రంగా చూసేవారు జనాలు. కానీ ఇప్పుడు మద్యం తాగే అలవాటు లేదు అంటూ ఎవరైనా చెబితే వారిని విచిత్రంగా చూడటం మొదలు పెడుతున్నారు. అంతలా మారిపోయింది నేటి రోజుల్లో లోకం తీరు.

 ఇక మద్యానికి బానిసైన కారణంగా ఎన్నో అనర్థాలు జరిగిపోతున్నాయి. కొన్ని కొన్ని సార్లు రోడ్డు ప్రమాదాలు జరిగి చివరికి ఎన్నో కుటుంబాలు విషాదంలో మునిగి పోతున్నాయి. మరికొన్నిసార్లు ఇక మద్యానికి బానిసై ఇంటి బాధ్యతలను  వదిలేసిన భర్త కారణంగా కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు ఇక మద్యం మత్తులో ఏకంగా మనిషిని ఉన్మాదిగా మార్చేస్తూ దారుణంగా సొంత వారి ప్రాణాలు తీసేలా చేస్తుంది మద్యం. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. మద్యం మత్తులో ఏకంగా కట్టుకున్న భార్యనే చంపేశాడు ఇక్కడ ఒక వ్యక్తి. కానీ ఉదయాన్నే మత్తు దిగిన తర్వాత జరిగిన విషయం తెలిసి ఒక్క సారిగా షాక్ అయ్యాడు.

 ఈ దారుణ ఘటన దేశ రాజధాని నగరం ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. 37 ఏళ్ల ఓ వ్యక్తి తన భార్యతో కలిసి మద్యం తాగాడు. తాగిన తర్వాత భోజనం పెట్టాలి అంటూ భార్యను కోరాడు. కానీ ఆమె సరిగా స్పందించలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఉన్న వ్యక్తి తన భార్యను హతమార్చాడు. ఆ తర్వాత భార్య మరణించిన విషయం పట్టించుకోని సదరు వ్యక్తి రాత్రంతా భార్య పక్కనే పడుకున్నాడు. ఇక తెల్లవారిన తరువాత మత్తు దిగితే గాని తెలియలేదు రాత్రి అతని భార్యను చంపాడు అన్న విషయం. ఒక్కసారిగా తేరుకొని భయంతో  అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: