అతనో సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. కానీ ఇలా చేశాడేంటి?

praveen
ఏంటో నేటి రోజుల్లో యువత ఆలోచన తీరు ఎటు పోతుందో కూడా అర్థం కాని విధంగా మారిపోయింది పరిస్థితి . ఆధునిక సమాజంలో కి అడుగు పెడుతూ పెద్దపెద్ద చదువులు చదువుతూ.. ఎన్నో మంచి ఉద్యోగాలు చేస్తున్న యువత  పరిపక్వత సాధిస్తున్నారు అనుకుంటే.. చిన్న చిన్న విషయాలకే  షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం గమనార్హం. తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని చెమటోడ్చి కష్టపడి ఆ డబ్బునంతా తమ పిల్లల కోసం ఖర్చుపెట్టి చదువులు చదివిస్తూ ఉంటే అటు చదువుకుంటున్న విద్యార్థులు మాత్రం ప్రేమా దోమా అంటూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.

 ప్రేమించిన యువతి దూరమైన కారణంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా యువతి కోసం ప్రాణాలు తీసుకునే ముందు తన మీదే ఆశలు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రుల గురించి మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు. ఇలా ఇటీవలి కాలంలో క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు  వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ప్రేమలో విఫలమై మనస్తాపానికి గురైన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ జి ఆర్ పి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

 పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన ఓదేలు కుమారుడు రమేష్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తూ ఉన్నాడు. ఇంటి నుండే పనిచేస్తూ ఉన్నాడు  ప్రస్తుతం. అతనితో పాటు చదువుకున్న యువత తో పదకొండేళ్లుగా ప్రేమలో కొనసాగుతున్నాడు సదరు యువకుడు. కులాలు వేరు కావడంతో ఆమె కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురైన  యువకుడు ఇటీవలే ఘట్కేసర్- చర్లపల్లి స్టేషన్ల మధ్య సింహపురి ఎక్స్ ప్రెస్ రైలు కు ఎదురు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్తింపు కార్డు ఆధారంగా సదరు మృతదేహం రమేష్ దిగా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: