ఛీ..ఛీ.. వీడికి అసలు బుద్ది అనేది లేదా?
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులు.. తమ స్నేహితుడికి లైవ్ స్ట్రీమ్ చేశారు. జూన్ 2న జరిగిన ఈ ఘటన.. శుక్రవారం బాధితురాలు పోలీసులను ఆశ్రయించడం తో తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితులు పరారీలో ఉన్నారన్న పోలీసులు.. వారి పేర్లను మాత్రం బయటపెట్టలేదు. బాలికపై జరిగిన ఈ ఘోరం పై కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి రాజీవ్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 2న ఇద్దరు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దాదాపు 21 ఏళ్లు వయసున్న ఇద్దరు వ్యక్తులు తనను జూన్ 2న ఓ హోటల్కు తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసినట్టు ఫిర్యాదు చేసింది.
అప్పుడు తీసిన వీడియోలో వీడియోలో మరో స్నేహితుడికి నిందితులు లైవ్స్ట్రీమ్ చేశారని.. అంతేకాకుండా ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమా ల్లో షేర్ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొందని వివరించారు. అయితే, నిందితులపై ఇంతకుముందు కూడా ఇలాంటి ఆరోపణలే ఉన్నాయని.. వారు పరారీలో ఉన్నట్టు గుప్తా తెలిపారు. బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుల పై పోక్సో చట్టం, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశామని.. వారిని పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.. ఏది ఏమైనా ఈ ఘటన మాత్రం స్థానికంగా కలకలం రేపుతుంది..