పెళ్ళైన యువతికి పేరెంట్స్ మరో పెళ్లి.. భర్త ఏం చేసాడో తెలుసా?

praveen
పెళ్లి అనే బంధానికి నేటి రోజుల్లో విలువ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా పెళ్లి అనే కాన్సెప్ట్ ను ఒక కమర్షియల్ ఎలిమెంట్ గా భావిస్తున్నారు. జీవితాంతం కలిసి ఉండే ఒక బంధం అని మాత్రం ఎవరూ భావించడం లేదు. ఈ క్రమంలోనే ఎంతోమంది ఒకటి కాదు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. తాను వివాహం చేసుకున్న యువతిని ఆమె తల్లిదండ్రులు మరొకరితో పెళ్లి చేశారు అనే విషయాన్ని సదరు యువకుడు జీర్ణించుకోలేకపోయాడు.

 దీంతో ఆత్మహత్య శరణ్యం అని భావించి బలవన్మరణానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అనంతపురం లోని గౌరీ థియేటర్ సమీపంలో నివసిస్తున్న బాలకృష్ణ సింగ్ రాడ్ బైండింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం తిరుమల వెళ్ళిన సమయంలో ఓ యువతితో పరిచయం ఏర్పడగా.. పరిచయం ప్రేమగా మారింది. అయితే ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో బంధువుల ఇంట్లో ఉంచి వివాహానికి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే సదరు యువతి బాలక్రిష్ణ సింగ్ పారిపోయి ఒక గుడిలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత అనంతపురం లో కాపురం పెట్టారు.

 అయితే యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనంతపురంలో కాపురం పెట్టిన వీరిని తీసుకొచ్చి యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు. పెద్దల సమక్షంలో పది రోజుల్లో పెళ్లి చేస్తామని హామీ ఇచ్చి యువతిని తీసుకెళ్లారు తల్లిదండ్రులు.  కానీ కొన్నాళ్లకు తమ కుమార్తెకు మరో వివాహం చేశామని ఆమె జోలికి రావద్దని తల్లిదండ్రులు సూచించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలకృష్ణ చివరికి ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన స్థానికులు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: