దారుణం..కన్న తండ్రే చిన్నారి జీవితాన్ని చిదిమేసాడు..

Satvika
ఒకప్పుడు ఆడపిల్ల పుడితే అదృష్టం, మా ఇంటి మహా లక్ష్మి అని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు కూడా కొంత మంది అంటున్నారు. కాకాపోతే అమ్మాయి పెరిగే కొద్ది భయాలు కూడా జనాల్లొ పెరిగి పొథున్నాయి. దేశంలో ఎక్కడో చోట రోజుకు 100 మంది వరకూ అత్యాచారం లేదా హత్యకు గురవుతున్నారని ఓ సర్వేలో తేలింది..అందులో బయట వాళ్ళ చేతిలో సగం అత్యాచారానికి గురైతే..మరో సగం మంది ఇంట్లో వాల్ల చేతిలో నలిగి పోతున్నారు.. ఇలాంటి ఘటనలు పోలీసులకు పెద్ద షాక్ అవుతుంది. ఇకపోతే తాజాగా ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న తండ్రి చిన్నారి జీవితాన్ని చీకట్లో పడేశాడు.

 
వివరాల్లొకి వెళితే.. వావివరసలు మరిచి అభం శుభం తెలియని 12 ఏళ్ల బాలికపై.. ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో చోటుచేసుకుంది. గురుసహాయ్‌గంజ్‌ కొత్వాలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురుసహాయ్‌గంజ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక సోమవారం రాత్రి తన అత్త వద్ద నిద్రపోతుండగా.. నిందితుడు ఆమెను బలవంతంగా వేరే గదిలోకి ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాలిక ఏడుపు విన్న అత్త.. కేకలు వేసింది.


 ఆమె అరుపులు విన్న స్థానికులు అక్కడకు చేరుకున్నారు.ఈ ఘటన పై పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, బాలిక తాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల కోసం జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు గురుసహాయ్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారి రాజ్‌కుమార్‌ సింగ్‌ మీడియాకు తెలిపారు. కాగా.. బాలిక పదేళ్ల క్రితమే తల్లి చనిపోగా అప్పట్నుంచి అదృశ్యమైన నిందితుడు (తండ్రి) నాలుగైదు రోజుల క్రితమే ఇంటికి వచ్చాడని కుటుంబసభ్యులు తెలిపారు.. ఈ ఘటన తో అందరూ చిన్నారి పరిస్థితిని చూసి జాలి పడుతున్నారు..ఆమెకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: