దారుణం..కన్న తండ్రే చిన్నారి జీవితాన్ని చిదిమేసాడు..
వివరాల్లొకి వెళితే.. వావివరసలు మరిచి అభం శుభం తెలియని 12 ఏళ్ల బాలికపై.. ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని కన్నౌజ్లో చోటుచేసుకుంది. గురుసహాయ్గంజ్ కొత్వాలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురుసహాయ్గంజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక సోమవారం రాత్రి తన అత్త వద్ద నిద్రపోతుండగా.. నిందితుడు ఆమెను బలవంతంగా వేరే గదిలోకి ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాలిక ఏడుపు విన్న అత్త.. కేకలు వేసింది.
ఆమె అరుపులు విన్న స్థానికులు అక్కడకు చేరుకున్నారు.ఈ ఘటన పై పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, బాలిక తాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల కోసం జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు గురుసహాయ్గంజ్ పోలీస్ స్టేషన్ అధికారి రాజ్కుమార్ సింగ్ మీడియాకు తెలిపారు. కాగా.. బాలిక పదేళ్ల క్రితమే తల్లి చనిపోగా అప్పట్నుంచి అదృశ్యమైన నిందితుడు (తండ్రి) నాలుగైదు రోజుల క్రితమే ఇంటికి వచ్చాడని కుటుంబసభ్యులు తెలిపారు.. ఈ ఘటన తో అందరూ చిన్నారి పరిస్థితిని చూసి జాలి పడుతున్నారు..ఆమెకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.