వామ్మో..వీడు మాములోడు కాదు..ప్రియురాలితో గొడవ పడి..

Satvika
లవర్స్ అన్నాక చిన్న చిన్న గొడవలు కామన్..కొద్ది సేపు అరుచుకున్న కాస్త ఆగాక మళ్ళీ ఇద్దరు ఒకటవుతారు. ఇది ఒకప్పటి మాట..కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.చిన్న మాటలు వచ్చినా విడిపోవడం, బ్రేకప్ అని చెప్పడం తర్వాత మళ్ళీ కక్షలు పెంచుకోవడం, ప్రేమోన్మాధిలా మారడం చేస్తారు.ఇప్పుడు మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది..ప్రియురాలి మీద కోపంతో అలిగి ఓ వ్యక్తి అన్నంత పని చేశాడు.ప్రియురాలితో గొడవ కారణంగా కోపంతో ఊగిపోయిన అతగాడు ఏకంగా రూ.40 కోట్లు ఫసక్ చేశాడు..ఇదెంది అనుకుంటున్నారా.. అయితే ఒకసారి ఇది చూడండి..


అతడి పేరు బ్రియాన్ హెర్నాండెజ్. వయసు 21ఏళ్లు. ఇతగాడు అమెరికాలోని డల్లాస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లోకి చొరబడ్డాడు. అక్కడ అరుదైన, విలువైన కళాఖండాలను ధ్వంసం చేశాడు. ఇతడు ధ్వంసం చేసిన కళాఖండాల విలువ ఎంతో తెలుసా? అక్షరాల రూ.40 కోట్లు.సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు బ్రియాన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఎందుకయ్యా ఇలా చేశావ్ అని అడగ్గా.. ఆ యువకుడు చెప్పిన సమాధానం విని వారు షాక్ అయ్యారు. తనకు గర్ల్ ఫ్రెండ్ పై ఎంతో ప్రేమ ఉందని బ్రియాన్ చెప్పాడు. అయితే ఇటీవల తన ప్రియురాలితో అతడు గొడవపడ్డాడట. ఇది తట్టుకోలేకపోయాయని, ఆ కోపంలోనే ఇలా చేశానని బ్రియాన్ చెప్పుకొచ్చాడు.



పోలీసులు బ్రియాన్ అదుపులోకి తీసుకున్నారు. మ్యూజియం ప్రవేశ ద్వారం వెలుపల రాత్రిపూట బ్రియాన్ కుర్చీతో ఉన్నట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది..విలువైనవి, అరుదైనవి, పురాతన కళాఖండాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ” కైలిక్స్ హెరాకిల్స్ మరియు నెమియన్ లయన్” విగ్రహం కూడా దెబ్బతింది. మొత్తం నష్టం విలువ సుమారు 5.2 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేశారు. మోనాలిసా పెయింటింగ్ విధ్వంసానికి ప్రయత్నించిన కొద్దిరోజులకే ఈ సంఘటన జరిగింది. ఒక సందర్శకుడు పెయింటింగ్ రక్షణ గాజుపై కేక్ విసిరాడు. కానీ కళాఖండం దెబ్బతినలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు..ఇది అతడి కొపంవెనుక దాగి ఉన్న అసలు కథ..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: