ట్విన్స్.. అన్న ప్లేస్ లో తమ్ముడు బెడ్ రూంలోకి.. చివరికి?

praveen
ఇటీవలికాలంలో ఎక్కడ చూసినా మహిళలపై వేధింపులకు సంబంధించిన ఘటనలూ తెరమీదికి వస్తూనే ఉన్నాయి. కామాంధుల బారిన పడకుండా ఉండేందుకు ఆడపిల్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎక్కడ పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదనే చెప్పాలి. వెరసి ఆడపిల్ల ప్రతిక్షణం భయపడుతు బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. అయితే మొన్నటి వరకూ ఏకంగా బయట తిరిగే ఆకతాయిల నుంచి మాత్రమే మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొనే వారు. ఏకంగా సొంతింటి వాళ్ళు కూడా మహిళలపై వేధింపులకు పాల్పడుతూ ఉండడంతో తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు.

 ఇలా ఇటీవల కాలంలో వేధింపుల కారణంగా ఎంతోమంది మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. మహిళలకు రక్షణ కల్పించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎందుకో పరిస్థితుల్లో మాత్రం ఎక్కడ మార్పు రావడం లేదని తెలుస్తోంది. ఇటీవలే మహారాష్ట్రలో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు కవల సోదరులు నీచాతి నీచమైన పని చేశారు. కవల సోదరులలో పెద్దవాడికి మొదట పెళ్లి జరిగింది. అయితే ఏకంగా ఆ యువకుడు తన భార్యను తమ్ముడితో పంచుకోవడానికి సిద్ధమయ్యాడు.

 ఇద్దరు కవలలు  కావడం తో  అచ్చుగుద్దినట్టు గా ఒకే లాగా ఉండేవారు. ఈ క్రమంలోనే కవలల్లో చిన్నవాడు అన్న భార్య పై కన్నేశాడు. ఓకే రూపురేఖలతో ఉండటంతో భర్త లాగానే వ్యవహరిస్తూ ఏకంగా ఆరు నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. ఇక చివరికి ఆరు నెలల తర్వాత ఆమెకు భర్త ఎవరో మరిది ఎవరో అన్న విషయం  విషయం తెలిసి షాక్ అయిన యువతి ఈ విషయాన్ని భర్తకు చెప్పగా అతను అలాగే కొనసాగించమని చెప్పడం తో మరింత షాక్ లో మునిగిపోయింది. దీంతో మహిళా ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని అరెస్టు చేశారు పోలీసులు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: