చిన్నపాటి అత్యుత్సాహం.. 17 మందికి గాయాలు?
కానీ కొన్ని కొన్ని సార్లు ఊహించిన దానికంటే ఎక్కువ మంది జనాలు వచ్చినప్పుడు మాత్రం ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇక ఇలాంటి తరహా ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. సాగర్ జిల్లాలో ఒక కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. బినా పట్టణంలో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమాల్లో దాదాపు 25,000 మంది భక్తులు హాజరయ్యారు. కాసేపు వరకూ ఎంతో సజావుగా సాగింది కార్యక్రమం. కానీ కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి తమ వారిని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించారు.
ఈ క్రమంలోనే బారికేడ్లను సైతం దాటుకుంటూ వచ్చేశారు. దీంతో తోపులాట జరగడంతో ఒకరిని చూసి మరొకరు ముందుకు రావడంతో గందరగోళం నెలకొంది. చూస్తూ చూస్తుండగానే అందరూ కలిసి కూర్చున్న వారిపై పడ్డారు. ఇలా తోపులాటలో భక్తులను కంట్రోల్ చేయలేకపోయారు నిర్వాహకులు. అదే సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఎంతోమంది కుప్పకూలిపోయారు. ఇలా ఎంతోమంది ఆర్తనాదాలతో అక్కడ గందరగోళం నెలకొంది. సుమారుగా 17మందికి గాయాలయ్యాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.