ప్రేమ పేరుతో మోసం.. వేరే రాష్ట్రానికి తీసు కెళ్ళి..

Satvika
అమ్మాయిలు , అబ్బాయిలు ఇప్పుడు ప్రేమ పేరుతో కామ వాంచన తీర్చుకుంటున్నారు...డేటింగ్ అని , ఇద్దరి మధ్య  కోరికలు తీరకా ఎవరి దారి వాళ్ళు పోతున్నారు.. కొన్ని ఘటనలు దారుణం గా వుంటే, మరి కొన్ని మాత్రం ఆలోచన లో పడ వేస్తున్నాయి. ఇప్పుడు మరో ఘటన వెలుగు లోకి వచ్చింది.ప్రేమ పేరుతో ఓ బాలికను మహరాష్ట్రకు తీసుకెళ్లిన యువకుడిని నారాయణగూడ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నేపాల్‌కు చెందిన లక్ష్మణ్‌ దమాయ కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి స్థిరపడ్డారు. అతని కుమారుడు కరణ్‌ పరియార్‌ హిమాయత్‌నగర్‌లోని మెమోస్‌లో పనిచేస్తున్నాడు. 

స్థానికంగా 9వ తరగతి చదువుతున్న తన అత్త కుమార్తె పై మనసు పారేసుకున్నాడు. చిన్నగా ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.



 అది కాస్త స్నేహంగా, ప్రేమగా మారింది.అలా ఇంట్లో తెలియకుండా ఇద్దరు కలిసి తిరిగెవాల్లు..వారి ప్రేమ పైత్యానికి చేరింది .అంతగా ఇద్దరు ప్రేమలో మునిగి తెలారు.కరణ్‌ పరియార్‌ సదరు బాలికను మహారాష్ట్రలోని కళ్యాణ్‌ నగరానికి తీసికెళ్లాడు.ఓ గది అద్దెకు తీసుకుని వారం రోజుల పాటు అక్కడే ఉన్నారు. తమ కుమార్తె కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. 



తన పేస్ బుక్ లో తండ్రి పై, అన్న పై కేసు నమోదు అయ్యిందని తెలుసుకున్నాడు. ఫేస్‌బుక్‌ పోస్ట్‌ వైరల్‌ కావడం తో కరణ్‌ పరియార్‌ తన సోదరుడు రాముకు ఫోన్‌ చేసి తాము కళ్యాణ్‌లో ఉన్నట్లు తెలిపాడు. ఎస్సై నరేష్‌ సూచన మేరకు సమీపంలోని ఉల్లాస్‌నగర్‌ పీఎస్‌లో లొంగిపోయాడు. అప్పటికే ఎస్సై అక్కడి పోలీసులకు సమాచారం అందించడంతో వారు అతడిని అదుపులోకి తీసుకున్నారు.ఇద్దరు ఇష్ట పూర్వకంగానే వెళ్ళినట్లు ఒప్పుకున్నారు.ఈ ఘటన పై పోలీసులు విచారణ చేపట్టారు.. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: