పెళ్లయిన 36 రోజులకే.. భర్త ప్రాణాలు తీసిన మహిళ.. కారణం?

praveen
మూడుముళ్ల బంధంతో ఒక్కటైన తర్వాత కలకాలం కలిసి ఉండాల్సిన భార్యాభర్తలు బద్ద శత్రువుల్లా మారిపోయి ఒకరిని ఒకరు దారుణంగా కడ తేర్చుకుంటున్న ఘటనలు రోజురోజుకీ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో కట్టుకున్న వారిని దారుణంగా హతమార్చేందుకు కూడా ఎక్కడా వెనకడుగు వెయ్యని పరిస్థితి నేటి రోజుల్లో కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఆమెకు ఇష్టం లేదని చెప్పినా బలవంతంగా పెళ్లి చేశారు తల్లిదండ్రులు. ఇలా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న యువతి చివరికి కట్టుకున్న భర్త ప్రాణాలు తీయడానికి సిద్ధమైంది.

 భర్త కంటే ప్రియుడే ముఖ్యం అనుకున్న ఆ యువతి ప్రియుడితో కలిసి చివరికి భర్త ను దారుణంగా హతమార్చింది. మొదటిసారి అన్నంలో విషం కలిపి హత్యాయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నం విఫలం కావడంతో రెండోసారి గొంతునులిమి చంపేసింది. చాతి నొప్పి  చనిపోవడానికి కారణం అంటూ కొత్త నాటకానికి తెర లేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పెళ్లైన ముప్పై ఆరు రోజుల్లోనే ఈ ఘటన జరగడం గమనార్హం. సిద్దిపేట జిల్లాలో  వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.

 దుబ్బాక మండలం చిన్న నిజాంపేట కు చెందిన కోనాపురం చంద్రశేఖర్ అనే 24 ఏళ్ల యువకుడు తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన 19 ఏళ్ల శ్యామలను పెళ్లి చేసుకున్నాడు. మార్చి 23 వ తేదీన వీరికి పెళ్లి జరిగింది. శ్యామల పెళ్లికి ముందే శివకుమార్ అనే యువకుడితో ప్రేమలో ఉంది. అయితే పెళ్లి ఇష్టం లేదు అని చెప్పినప్పటికీ తల్లిదండ్రులు బలవంతపెట్టి చంద్రశేఖర్ కు ఇచ్చి పెళ్ళి చేశారు. కానీ ఇక ఆ తర్వాత దారుణంగా ఆలోచించిన శ్యామల చంద్రశేఖర్ ను హత్య చేయాలని ప్రణాళిక వేసింది.  ప్రియుడితో చేతులు కలిపింది. ఈ క్రమంలోనే భర్తతో కలిసి గుడికి వెళుతున్నట్లు వాహనంపై బయలుదేరింది. అక్కడే ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్ళింది. కాగా అక్కడ మాటువేసి ఉన్న శివ కుమార్ అతని స్నేహితులు ద్విచక్ర వాహనాన్ని అడ్డుకుని చంద్రశేఖర్ ను ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఇక పోలీసు విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి. దీంతో నిందితులను అరెస్టు చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: