కొడుకు చూస్తుండగానే తల్లి పై అత్యాచారం.. 79 రోజులు నరకం..
ఈ ఘటన గురించి వింటేనే ఎంత నరకంగా ఉంది కదా..ఇప్పుడు ఆ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం..ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఓ తాంత్రికుడు వివాహితపై తన రెండున్నరేళ్ల కుమారుడి ఎదుట 79 రోజుల పాటు పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు శనివారం తెలిపారు.5 ఏళ్ళ కిందట ఆమెకు వివాహం జరిగింది.కట్నం కోసం అత్తమామలు శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. దీంతోతనతో కొన్ని నెలల పాటు ఉంటే విభేదాలను పరిష్కరిస్తానని తాంత్రికుడు కుటుంబానికి హామీ ఇచ్చాడు.
అత్తామామలు తనని బలవంతంగా మత్తు ఇచ్చి తాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్లారని మహిళ చెబుతోంది. తనతో పాటు తన కుమారుడిని కూడా పంపించారని పేర్కొంది.తాంత్రికుడు తన కొడుకు ముందే తనను 79 రోజుల పాటు బలవంతంగా అత్యాచారం చేశాడని మహిళ పోలీసులకు తెలిపింది. శుక్రవారం నాడు తాంత్రికుడు సెల్ ఫోన్ మర్చిపోయి వెళ్లడంతో మహిళ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన పరిస్థితి గురించి చెప్పింది.చలించి పోయిన వాళ్ళు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళ భర్త, మరిది, అత్తామామలపై కేసు నమోదు చేశారు. కానీ, తాంత్రికుడు పరారీలో ఉన్నాడని, గాలింపులు చేపడుతున్నామని చెప్పారు.ఈ దారుణ ఘటన సంచలనంగా మారింది.