అయ్యో పాపం..తండ్రి చేసిందానికి కూతురు బలి..

Satvika

అమ్మాయిగా పుట్టడం ఒక శాపం అనే చెప్పాలి..బయట రాబందులతో రక్షణ లేదు.. ఇక ఇంట్లో కూడా వారి మానానికి రక్షణ లేదు..నా అనుకున్న వాళ్ళే నట్టేట్లో ముంచెస్తారు. కన్న తండ్రి కసాయి లాగా మారాడు. వారి వరుసలు మరచి కూతురి పై క్రూర మృగం లాగా దాడికి దిగాడు.ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేక, తనలో తానే కుమిలి పోయిన ఓ యువతి..తండ్రి చేసిన పాపానికి తన ఉసురు తీసుకుంది. కడుపున పుట్టిన కన్న బిడ్డలను కూడా ఆఖరికి వదల్లేదు. తాజాగా మరో నీచపు ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కన్న కూతురు అనేది కూడా మరచి పోయి, కనికరం లేకుండా బెదిరించి అత్యాచారం చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.


వివరాల్లొకి వెళితే..ఉత్తరప్రదేశ్ లోని బాందాలోని మార్క్ పోలీస్ స్టేషన్ లో ఓ నీఛుడు నివాసం ఉంటున్నాడు. 22 సంవత్సరాల క్రితం అతనికి పెళ్లి అయ్యింది. కూతురితో పాటు ఓ కొడుకు ఉన్నాడు. కూతురికి 18 ఏళ్ల వయసు ఉంది. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న అమ్మాయి మీద ఆమె కన్నతండ్రి కన్ను వేశాడు.తనకూ పుట్టింది అనే సంగతి కూడా మర్చిపొయాడు.. మొన్న రాత్రి మద్యం మత్తులో ఆమెను కత్తితో బెదిరించి కూతురి మీద అత్యాచారం చేసి అతని కామం తీర్చుకున్నాడు.


ఈ విషయం ఎవరికైనా చెబితే నిన్ను చంపేసి శవం కూడా చిక్కకుండా చేస్తానని కూతురిని బెదిరించాడు. కన్నతండ్రి అత్యాచారం చెయ్యడంతో కుమిలిపోయిన కూతురు శుక్రవారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లి చూస్తే ఆ యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది.ఆ తర్వాత జరిగిన ఘటన బయటకు వచ్చింది.అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాట తీసే పనిలో ఉన్నారు.. అతడు చేసిన పని అందరికి తెలియడంతో అతన్ని ఉరి తీయాలని నినాదాలు చేస్తున్నారు..ఇలాంటి మనుషులు ఉన్నంతవరకు సమాజం తీరు మారదు..మహిళలకు రక్షణ లేదని ప్రముఖులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: