భర్తను చంపడానికి ప్లాన్ చేసింది.. చివరికి..
జిల్లాలొని నంద్యాలలో చోటుచేసుకుంది. ప్రియాంకనగర్ వీధికి చెందిన ఈశ్వర్ రెడ్డికి శివపార్వతితో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. చిరు వ్యాపారాలు చేసుకునే ఈశ్వర్ రెడ్డి అప్పుల పాలయ్యాడు. ఈ నేపథ్యంలో గత ఐదేళ్లుగా అప్పుల వారి నుంచి తప్పించుకుంటూ అప్పుడప్పుడు ఇంటికి దొంగగా వచ్చే వాడు. అయితే భార్యకు డబ్బు అవసరం ఉండటంతో ఆమె వేరే మార్గాలను ఎంచుకుంది.అదే కాలనీలో ఉంటున్న నాగరాజు అనే వ్యక్తి తో పరిచయం ఏర్పడింది..నాగరాజుతో శివపార్వతి వివాహేతర సంబంధం పెట్టుకుంది.
బుధవారం రాత్రి ఇంటికి చేరుకున్న ఈశ్వర్రెడ్డి భార్యను నాగరాజుతో చూశాడు. ఈ విషయమై ఆమెతో భర్త గొడవ పడ్డాడు. ఇంతలో నాగరాజు తన ముగ్గురు స్నేహితులతోపాటు, శివపార్వతితో కలిసి వెదురు కర్రల తో చిథకబాదారు.. ఆ సమయంలో వారు పెద్దగా అరవడం తో చుట్టూ పక్కల వాళ్ళు వచ్చి అతణ్ణి వెంటనే ఆసుపత్రికి తరలించారు..కోలుకున్న బాధితుడు గురువారం తన భార్య శివపార్వతి, నాగరాజుతో పాటు మరో ముగ్గురిపై పోలీసు కేసు పెట్టాడు. అతని వివరాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ లో నమ్మలేని నిజాల ను బయటకు తీసారు. ఈ కేసులో పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి..