రాజస్థాన్‌లో మరో దారుణం..గ్యాంగ్ రేప్ చేసి..

Satvika
మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చర్యలను తీసుకున్నారు.. కొత్త శిక్షలను అమలు చేస్తున్నారు.. మరో వైపు పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ మహిళలకు రక్షణగా నిలుస్తున్నారు.ఎన్ని చేసినా కామాంధుల చర్యలలొ గానీ, లైంగిక దాడులు జరగడం కానీ ఆగలేదు. ఎక్కడో చోట అమాయికమైన మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. నిర్భయ, దిశా లాంటి ఎందరో అమాయికులు తమ మాన ప్రాణాలను వదిలేస్తున్నారు. ఇది నిజంగా అవమానీయ సంఘటన.. ఇంత మంచి టెక్నాలజీ ఉండి కూడా అమ్మాయిల ప్రాణాలు ను కాపాడ లేకపోతున్నారు..

ఇప్పుడు జరిగిన ఘటన ఎవరినైనా కంటతడి పెట్టుకోనెలా చెస్తుంది.. మైనర్ బాలికను బలవంతంగా ఎత్తుకెళ్ళి అతి దారునంగా గ్యాంగ్ రేప్ చేసి చంపారు. ఒకరి తర్వాత మరొకరు అతి క్రూరంగా రేప్ చేశారు. అంతటి తో ఆగని దుర్మార్గులు అమ్మాయి జననెంద్రియాలను పదునైన ఆయుదాల తో కొసారు. అపస్మారక స్ధితిలో ఉన్న బాలికను చూసిన గ్రామస్తులు  వెంటనే పోలీస్టేషన్ కు సమాచారం అందించారు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అమ్మాయిని ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది.

వివరాల్లొకి వెళితే.. రాజస్థాన్‌ నగరం లో 15 ఏండ్ల బాలిక పై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన దుర్మార్గులు, ఆమె జననేంద్రియాలను పదునైన వస్తువులతో తీవ్రంగా గాయపరిచారు. తర్వాత బాలిక చనిపోయిందని భావించి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. రాజస్తాన్ రాష్ట్రం ఆళ్వారు లోని మలఖేడ్ గ్రామం లోని కల్వర్టు సమీపంలో చావు బతుకుల మధ్య ఉన్న బాలికను చూసి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు వచ్చిన పోలీసులు అమ్మాయిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మిస్సింగ్ కేసు ఆధారంగా వివరాలు తెలుసుకొని పేరెంట్స్ కు సమాచారం అందించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉన్నాయి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: