అయ్యో పాపం.. ప్రేమించి పెళ్ళిచెసుకున్నాడు..చివరికి..

Satvika
ప్రేమ వివాహాలు ఈరోజుల్లో ఎక్కువ అయ్యాయి. ప్రేమించి పెద్దలను ఎదురించి చాలా మంది వివాహాలు చేసుకున్నారు. అందు లో కొన్ని మాత్రమే జీవితాంతం ఉంటున్నాయి. అయితే నిజమైన ప్రేమ జీవితాంతం ఉంటుంది అంది అక్షర సత్యం.. అవసరాలకు వచ్చిన ప్రేమ అంతలోనే తగ్గి పోతుంది. ఇప్పుడు కూడా అలాంటి ఘటన వెలుగు చూసింది. ప్రేమించిన వ్యక్తి కి అనుకోకుండా ఒక జబ్బు చేయడం తో అతణ్ణి వదిలేసి వెళ్ళిపోయింది.



ఇప్పుడు అలాంటి ఘటన అందరినీ ఆలోచన లో పడ వేసింది.. కట్టుకున్న భర్తకు పక్షవాతం రావడం తో విడాకులు ఇచ్చి వెళ్ళి పోయింది. తనను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రేయసిని పెళ్లాడితే తనకు రోగం వచ్చిందని వదిలేసి వెళ్లిపోయిందని వాపోతున్నాడు ఓ భర్త. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. గుంటూరు లోని నెహ్రూ నగర్ కు చెందిన ఓ బాధితుడు సోమవారం నాడు అర్బన్ స్పందన లో ఓ ఫిర్యాదు చేసాడు. తను 2001లో ఓ ఫైనాన్స్ కంపెనీ పెట్టి వ్యాపారం చేస్తున్నప్పుడు తనకు ఓ యువతి పరిచయమైందనీ, ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని తెలిపాడు.



వారి కాపురాని కి గుర్తు  ఓ పాప పుట్టిందనీ, 12 ఏళ్ల కు తను పక్షవాతం బారిన పడినట్లు వెల్లడించాడు. దాంతో తన భార్య తనను వదిలేసి 2016 లో వేరే వ్యక్తి తో సన్నిహితంగా మెలుగుతూ వచ్చిందనీ, తన కుమార్తె తో సహా తనను వదిలేసి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను పట్టించుకునే వారే లేకుండా పోయారనీ, ఆత్మ హత్య చేసుకోవడం ఒకటే తనముందు మార్గంగా కనబడుతోందంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. తన భార్య తో విడాకులు ఇప్పించి తన కుమార్తె ను తనకు దక్కేలా చూడాలంటూ ఫిర్యాదు లో పేర్కొన్నాడు..అతని వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: