ఛీ..ఛీ.. చేతబడి చేస్తానని నమ్మించి చివరికి పాడుపని చేశాడు..

Satvika
కాలం ఎంత వేగంగా మారిపొథుంది..అంతకు మించి సైన్స్ కూడా బాగా దెవెలప్ అయ్యింది. అయినా కూడా కొందరి నమ్మకాలు మాత్రం మారలేదు. మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకొని ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. ఇటువంటి వాటిని ఎన్నెన్నో దారునలకు పాల్పడుతున్నారు. గతంలో ఓ కుటుంబం వేరే లోకం వెళ్తామని ఇద్దరు కూతుర్లను తలపై కొట్టి చంపేసిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనలో చనిపోయిన ఇద్దరూ ఉన్నత విద్యావంతులే. కేవలం నిరక్షరాస్యులే ఇలాంటి మూఢనమ్మకాలు నమ్ముతారనే విషయం తప్పని ఆ ఘటన నిరూపించింది..

ఇలా ఎన్నో ఘటనలు దేశం నలు మూలల వెలుగు చూస్తున్నాయి.ముసుగులో మహిళలను లైంగికంగా వాడుకున్న దొంగ స్వామిజీలను ఎందరినో చూస్తున్నాం. అయినా అలాంటి స్వామిజీలను జనం ఇప్పటికీ నమ్ముతున్నారు. అలాగే మూఢనమ్మకాలతో భయపెట్టి లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు కూడా చూస్తూనే ఉన్నాము. తాజాగా నెల్లూరు జిల్లా లో ఒక అమానుష ఘటన చోటుచేసుకోవడంతో కలకలం రేపుతుంది.. 50 ఏళ్ల వ్యక్తి ఆమెను లోబర్చుకోవాలనుకున్నాడు. దాని కోసం చేతబడిని ఆయుధంగా మార్చుకున్నాడు. తన కోరిక తీర్చకపోతే తల్లిదండ్రులపై చేతబడి చేస్తానని భయపెట్టాడు. దీంతో బెదిరిపోయిన ఆ యువతి ఆ వ్యక్తి చెప్పినట్టు చేసింది.

ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని భయపెట్టాడు. ఆ 50 ఏళ్ల వ్యక్తి 5 నెలలుగా లైంగిక దాడి చేయడంతో యువతి గర్భం దాల్చింది.. అది తెలుసుకున్న ఆ వ్యక్తి ఆమెకు మాత్రలను కూడా ఇచ్చాడు.హాస్పిటల్ లో డాక్టర్లు ఆమె గర్భవతి అని చెప్పారు. దీంతో ఏం జరిగిందని ఆరా తీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. జరిగిన ఘోరం మొత్తం చెప్పింది.ఈ ఘటన విషయంలో యువతి తండ్రి శ్రీహరికోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీహరికోటలోని ఓ ప్రాంతానికి చెందిన ఓ గిరిజన యువతి ఇందులో బాధితురాలు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: