ఛీ ఛీ.. కోడలిపై కన్నేసిన మామ.. చివరికి?
మానవత్వాన్ని మరిచి పోతున్న మనుషులు కామంతో ఊగిపోతూ ఆడపిల్లలపై అత్యాచారాలు పాల్పడుతున్నారు. నెలలు నిండని పసికందుల నుంచి పండు ముసలి వరకు కూడా ఎవరినీ వదలడం లేదు. అయితే ఆడపిల్లలపై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకు వచ్చినప్పటికీ ఎక్కడ ఎవరిలో మార్పు మాత్రం రావడం లేదు అని చెప్పాలి. ఎవరిలో శిక్ష పడుతుంది అన్న భయం మాత్రం కనిపించడం లేదు. ఇక్కడ ఇలాంటి తరహా దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న తండ్రిలా చూసుకోవాల్సిన కోడలిపై కన్నేసి దారుణానికి పాల్పడ్డాడు మామ. ఈ ఘటన మెహబూబ్ నగర్ లో వెలుగులోకి వచ్చింది.
కురవి మండల కేంద్రం శివారులోని సోమ్లా తండా లో ఓ కుటుంబం నివసిస్తోంది. ఈ తండ్రిలా చూసుకోవాల్సిన మామ కోడలు పై కన్నేశాడు. ఈక్రమంలోనే సమయం కోసం ఎదురు చూసాడు. ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో కోరిక తీర్చాలి అంటూ కోడలిని వేదించాడు. ఇక ఇటీవలే మహిళ ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో భర్త తండ్రిని హెచ్చరించాడు. అప్పటినుంచి కోడలపై పగ పెంచుకున్నాడు మామ. ఇక ఇటీవల మరోసారి సమయం చూసి దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు. ఘటన అందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపడెలా గురిచేసింది ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.