పాల్వంచ : ముగ్గురు ఆత్మ‌హ‌త్య కేసులో కొత్త ట్విస్ట్.. ఏమిటంటే..?

N ANJANEYULU
భ‌ద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ‌లో జ‌రిగిన ముగ్గురు కుటుంబ స‌భ్యుల ఆత్మ‌హ‌త్య కేసులో కొత్త ట్విస్ట్ తెర‌పైకొచ్చింది. ఈ మిస్ట‌రీ ఆత్మ‌హ‌త్య‌లు పొలిటిక‌ల్ ట‌ర్న‌ర్ తీసుకున్నాయి. ఆత్మ‌హ‌త్య‌ల‌ను ముందు రామ‌కృష్ణ రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఈ లేఖ‌లో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.
కొత్త‌గూడెం ఎమ్మెల్యే వ‌నమా వెంకటేశ్వ‌ర‌రావు కుమారుడు వ‌న‌మా రాఘ‌వేంద్ర‌రావు, మా అమ్మ సూర్య‌వ‌తి, మా అక్క మాధ‌వి ఈ ముగ్గురు నా చావుకు కార‌ణ‌మ‌ని రామ‌కృష్ణ సూసైడ్‌నోట్‌లో రాసాడు. గ‌త కొంత కాలంగా కుటుంబ క‌ల‌హాలు, ఆర్థిక ఇబ్బందులు కార‌ణంగా కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఆత్మ‌హ‌త్య‌కు త‌న‌తో పాటు భార్య పిల్ల‌ల‌పై పెట్రోల్ పోసీ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న స్థ‌లాన్ని ప‌రిశీలించిన పోలీసులు విచార‌ణ నిర్వ‌హించిన  త‌రువాత పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని పేర్కొన్నారు. దోషులు ఎంత‌టి వారు అయినా శిక్షిస్తాం అని వెల్ల‌డించారు.
ఇదిలా ఉండ‌గా.. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని పాల్వంచ‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మ‌హ‌త్య‌కు ఒడిగ‌ట్టారు. ఇంట్లో త‌న‌తో పాటు భార్య పిల్ల‌ల‌పై పెట్రోల్ పోసి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాల‌ను సేక‌రిస్తుంది. ఈ ఘ‌ట‌న‌లో మ‌రొక బాలిక‌కు తీవ్రంగా గాయాలు కావ‌డంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుప్ర‌తికి త‌ర‌లించారు.
అయితే పాల్వంచ‌కు చెందిన మండిగ నాగ రామ‌కృష్ణ న‌వ‌భార‌త్‌లో మీ సేవా సెంట‌ర్ నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల డాడీస్ రోడ్ అనే యాప్ ఎగ్జిక్యూటివ్‌గా ప‌ని చేసారు. అయితే కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ట్టు స్థానికులు పేర్కొంటున్నారు. సోమ‌వారం  పాత పాల్వంచ‌లోని జెండాల బ‌జార్‌లోని నివాసంలో పెద్ద శ‌బ్దం రావ‌డంతో స్థానికులు వ‌చ్చి చూడ‌గా మండిగ నాగ‌రామకృష్ణ ఆయ‌న భార్య శ్రీ‌ల‌క్ష్మీ, కుమార్తె సాహిత్య మృతి చెందారు. మ‌రొక కుమార్తె ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: