డ్ర‌గ్స్ కేసులో మ‌రోసారి ఎన్సీబీ విచార‌ణ‌కు అన‌న్య పాండే..!

Paloji Vinay
ఈ నెల ప్రారంభంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేసిన ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి తాజాగా మ‌రోసారి ప్ర‌ముఖ న‌టుడు చుంకీ పాండే కుమార్తే బాలీవుడ్ హీరోయిన్ అన‌న్య పాండేను ఈ రోజు మళ్లీ విచారణకు పిలిచారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ప్రశ్నించడానికి నటిని పిలిపించడం ఇది మూడోసారి కావ‌డం గ‌మ‌నార్హం. అనన్య పాండేను గత గురువారం మొదటిసారిగా పిలిపించి రెండు గంటలకు పైగా ప్రశ్నించారు. ఎన్‌సిబి ఆమె ల్యాప్‌టాప్ మరియు రెండు మొబైల్ ఫోన్‌లను కూడా స్వాధీనం చేసుకుంది.

శుక్రవారం రెండో రౌండ్‌ విచారణకు హాజరు కావాల్సిందిగా ఆమెను కోరగా దాదాపు నాలుగు గంటల పాటు గ్రిల్ చేశారు. స‌మాచారం మేర‌కు.. ఎన్‌సిబి అధికారులు శుక్రవారం అనన్య పాండేని విచారించినప్పుడు ఆధారాలు కనుగొనలేకపోయారు మరియు అందుకే ఆమెకు సోమవారం మళ్లీ సమన్లు వచ్చాయ‌ని తెలుస్తోంది. గ‌తంలో విచార‌ణ స‌మ‌యంలో ఆర్య‌న్ ఖాన్‌తో చాటింగ్ ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే.  దీంతో ఆర్య‌న్‌తో డ్ర‌గ్స్ విష‌యంలో జోక్ చేశాన‌ని అనన్య చెప్పిన‌ట్టు తెలిసింది.
 
    అయితే, ఆర్య‌న్ ఖాన్‌కు డ్ర‌గ్స్ ఎవ‌రు ప‌రిచ‌యం చేశారు అనే అంశం విచార‌ణ సాగుతోంది.  దీంతో ఆ విష‌యంలో ప్ర‌ముఖంగా వినిపించిన పేరు అన‌న్య పాండేది కావ‌డంతో.. తాజాగా నేడు అన‌న్య పాండేను ఎన్సీబీ విచారిస్తోంది.  అయితే, ఆర్య‌న్‌తో అన‌న్య పాండే జ‌రిపిన వాట్స‌ప్ చాట్ గురించి నిఘా పెట్టిన పోలీసులు మ‌రోసారి ఆమెను ప్ర‌శ్నిస్తున్న‌ట్టు సమ‌చారం. కానీ, ఎంత అడిగిన అనన్య మాత్రం ఒకే విధంగా స‌మాధానం ఇస్తుంద‌ని తెలుస్తోంది.


    త‌న జీవితంలో ఎన్న‌డూ డ్ర‌గ్స్ తీసుకోలేద‌ని ఆర్య‌న్ కేవ‌లం డ్ర‌గ్స్ విష‌యంలో జోక్ చేశాన‌ని చెబుతున్న‌ట్టు స‌మ‌చారం. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో జోక్ చేసిందా లేదా అస‌లు ఎందుకు చాట్ చేసింద‌ని విష‌యంపై పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.  మొత్తానికి ఈ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో తెలిసో తెలియ‌కుండాఏ అన‌న్య పాండే ముఖ్య‌పాత్ర పోషించిన‌ట్టుగా క‌నిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: