బాలికపై 3రోజులు వృద్ధుడి అత్యాచారం!

Veldandi Saikiran
హనుమకొండ జిల్లా లో మరో దారుణ ఘటన బయటపడింది. ఓ బాలికకు మాయమాటలు చెప్పి ఓ వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణమైన ఘటన హనుమకొండ జిల్లాలోని వడ్డేపల్లి పరిమళ కాలనీ లో బుధవారం జరిగింది. ఈ ఘటన మూడు రోజుల కింద జరిగినప్పటికీ బుధవారం రోజున వెలుగులోకి వచ్చిందని సమాచారం అందుతోంది. హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో సూపరిండెంట్ గా పనిచేస్తున్న బింగి బిక్షపతి 69 సంవత్సరాల రిటైర్డ్ ఉద్యోగి...  అభం శుభం తెలియని ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బింగి బిక్షపతి ఇంటి దగ్గరే ఉంటున్న ఓ వికలాంగుడు... తన ఏకైక కూతురు తో అద్దెకు ఉంటున్నారు. బాధిత బాలిక తల్లిదండ్రుల మధ్య వివాదం తలెత్తింది. 

ఈ తరుణంలోనే ఆ బాధిత బాలిక తల్లికి దూరంగా ఉంటూ తండ్రి దగ్గరే జీవనం సాగిస్తోంది. ఇదే అదునుగా చూసుకున్న బింగి బిక్షపతి..  ఆ బాలిక పై కన్నేశాడు. ఇంకేముంది ఆ వికలాంగ తండ్రి లేని సమయంలో ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు బింగీ బిక్షపతి. ఏకంగా మూడు రోజుల పాటు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు సమాచారం అందుతోంది. అయితే ఆ బాధను తట్టుకోలేని ఆ అమాయకపు బాలిక... అసలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో బాధిత తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక దీంతో రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు ఆ రిటైర్డ్ ఉద్యోగి బింగి బిక్షపతి పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసారు.

ప్రస్తుతం నిందితుడు భింగీ బిక్షపతి పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇక ఈ ఘటన పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు స్థానికులు.  ఇలాంటి వారి కారణంగానే... మంచి వ్యక్తులకు కూడా చెడ్డ పేరు వస్తుందని ఫైర్ అవుతున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడ్డాయి వారిని తక్షణమే శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. అలాగే ఆ బాధిత బాలిక మరియు  ఆమె తల్లిదండ్రులను ప్రభుత్వం ఆదుకోవాలని పేర్కొన్నారు స్థానికులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: