కామంతో ఊగిపోయిన దివ్యాంగుడు.. చివరికి ఏం జరిగిందంటే?

praveen
కామాంధుల తీరులో మార్పు రావడంలేదు..  దీంతో మహిళల జీవితం రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారిపోతోంది. కామంతో కళ్లు మూసుకుపోయిన నేటి సమాజంలో ఆడపిల్లగా ఎందుకు పుట్టామా అని ప్రతి ఒక్క మహిళ బాధ పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి  కామంతో కళ్లు మూసుకుపోతున్న మగాళ్ళు ఆడపిల్ల కనిపిస్తే చాలు  మానవ మృగాలుగా మారిపోయి దారుణ అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అంతటితో ఆగకుండా హత్యలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎక్కడ మహిళల పట్ల వక్ర బుద్ధితో ఆలోచిస్తున్న వారిలో మాత్రం మార్పు రావడం లేదు.

 దీంతో రోజురోజుకీ ఆడపిల్ల జీవితం ప్రశ్నార్థకంగానే మారిపోతుంది.  ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఓ చోట కామాంధుల కోరల్లో చిక్కుకొని ఆడపిల్లలు బలి అవుతూనే ఉన్నారు.  బయటికి వెళ్తే ఆకతాయిల నుంచి బడికి వెళ్తే ఉపాధ్యాయుల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొనే వారు ఆడపిల్లలు. కానీ ఇప్పుడు ఏకంగా సొంత వారి నుంచి కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొంటూ ఉండడంతో ప్రతి ఆడపిల్ల దుర్భర స్థితిలో జీవితాన్ని గడపాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ నిజాంబాద్ జిల్లాలో ఇలాంటి ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అతడు ఒక దివ్యాంగుడు అతనికి భార్య పిల్లలు కూడా ఉన్నారు.

 కానీ ఇటీవలే ఆ దివ్యాంగుడు పశువుల మారిపోయాడు. కామంతో  ఊగిపోయాడు.  శుభం తెలియదు చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది. నిజాంబాద్ లోని ఓ కాలనీలో కూలి పనులు చేసుకుంటూ కొన్ని కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ క్రమంలోనే పెద్దలు పిల్లలను ఇంట్లో వదిలి పనులకు వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అదే ప్రాంతంలో ఉంటున్న పోలియో పీడితుడు అయినా దివ్యాంగుడు వసీం ఎనిమిదేళ్ల బాలిక పై కన్నేశాడు. ఈ క్రమంలోనే చాక్లెట్ ఆశ చూపి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరునాడు బాలికకు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. ఇక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు తాపీ మేస్త్రి గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: