కూలిన ఇల్లు... ఏడుగురు మృతి...!
కర్నాటకలోని బెళగావి జిల్లాలో ఈ విషాదకరమైన సంఘటన జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా బదల అంకాలగి గ్రామంలో ఓ ఇల్లు కూలిపోవడంతో ఇంట్లో ఉన్న వారందరూ మరణించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. శిథిలావస్థకు చేరిన ఇల్లు కావడంతో వర్షానికి నాని తడిసి కూలిపోయినట్టు పేర్కొంటున్నారు. ఈ విషయంపై సమాచారం తెలుసుకున్న కర్నాటక సీఎం బసవరాజు బొమ్మె విచారకరని ప్రకటించాడు. మృతులకు నష్టపరిహారం చెల్లించనున్నట్టు ప్రకటించారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
ఆకస్మాత్తుగా ఉన్నట్టుండి ఈ విషాదకరమైన ఘటన చోటు చేసుకోవడంతో ఆ గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. ఒకేసారి ఏడుగురు మృతి చెందడం మామూలు విషయం కాదు. పురాతనమైన ఇండ్లలో నివసించే వారు ఇప్పటికైనా మేల్కొని ఇల్లు మారాలని పలువురు సూచిస్తున్నారు. ఏక్షణంలో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంటుంది. ఆర్థికంగా ఎలా ఉన్నా సొంత ఇల్లు కట్టుకోవడం ఉత్తమం. పేదల అభివృద్ధి కోసం ప్రభుత్వం కనీస అవసరాలు తీర్చితే ఇలాంటి సమస్యలు తలెత్తవు అని పలువురు పలువిధాలుగా చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం సాయం అందించిన అందించకపోయిన కనీస అవసరాల్లో ఒకటైన ఇల్లు నిర్మించుకుంటే ఎంతో సేఫ్. ఏది ఏమైనా పురాతన ఇండ్లలో నివసించకపోవడం ఎంతో బెటర్.