పెళ్లైన కొద్ది రోజులకే భర్త అదృశ్యం... ఆ విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...!
భార్యభర్తలిద్దరూ తరుచూ చిన్న చిన్న గొడవలు పడుతుండేవారు. ప్రతీ చిన్న దానికి ఏదో ఒక గొడవ పెట్టుకునేవారు. పెద్దలు ఎంత చెప్పినా కానీ ఆ నవ దంపతుల తీరు మాత్రం మారలేదు. నాలుగు నెలల కాలం నుంచి వారిద్దరి మధ్య తరుచూ వాగ్వాదం చోటు చేసుకునేది. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 20న భర్త పండితురై కనిపించకుండా అదృశ్యమయ్యాడు. అతని ఆచూకి కోసం కుటుంబ సభ్యులు వెతకని చోటు అంటూ లేదు. ఎంత వెతికినా ఆచూకి మాత్రం లభించలేదు. అతని మొబైల్ నెంబర్కు ఫోన్ చేస్తే స్విచాప్ వస్తుంది. దీంతో ఆందోళన చెందిన పండితురై తల్లి మీనాక్షి అదనకొట్టె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
పోలీసులు ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసుకొని అదృశ్యమైన పండితురై కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో భార్య నందిని పై పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమె విచారించగా అసలు విషయం తెలిసింది. భర్త పండితురైని తానే చంపానని.. ఇంటి వెనుక ఉన్న పాడుపడిన బావిలో శవాన్ని వేశానని షాకింగ్ విషయం వెల్లడించింది నందిని. సెప్టెంబర్ 20న తన భర్తకు తనకు మధ్య గొడవ జరిగిందని, నన్ను గొంతు కోయాలని చూశాడు. నేను ఆత్మ రక్షణ కోసం పక్కనే ఉన్న వస్తువుతో తలపై బాదాను. తలకు బలంగా దెబ్బ తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేరు. గుట్టు చప్పుడు కాకుండా భర్త మృతదేహాన్ని తన ఇంటికి సమీపంలో ఉన్న పా త బావిలో పడేశానని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. పోలీసులు పాత బావిలో ఉన్నమృతదేహాన్ని బయటికి తీయించారు. మరణించి దాదాపు 15 రోజులు కావడంతో మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లిందని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.