నిమజ్జనానికి వెళ్లిన బాలికపై 17 ఏళ్ల బాలుడు అత్యాచారం..ఏం..!

MOHAN BABU
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అత్యాచార ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. రోజుకు ఎక్కడో ఒక దగ్గర ఈ ఘటనలో వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎక్కువగా మైనర్ లే ఈ ఘటనలకు పాల్పడుతున్నారు. ఎందుకిలా జరుగుతోంది.. వీరిని ఇలాంటి ఆలోచనలకు కారణం ఎవరు..? అసలు ఎందుకిలా చేస్తున్నారు..? వారికి తెలియకుండానే తప్పులు చేసి  చివరికి జైలు పాలవు తున్నారు. అయితే ఈ ఘటనలో మైనర్ బాలికకు ఆ బాలుడు మాయమాటలు చెప్పి మసీద్ వెనుక తీసుకెళ్ళాడు ఆ తర్వాత ఆమెపై లైంగిక  దాడికి పాల్పడ్డాడు.

నిర్భయ లాంటి ఎన్నో కఠినమైన చట్టాలు తీసుకువచ్చిన  నేరస్తులను ఎన్కౌంటర్ చేసిన మా దేశంలో ఇలాంటి అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. మహిళలకు బాలికలకు భద్రత అనేది లేకుండా పోతుంది. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. బాలికపై మైనర్ బాలుడు అత్యాచారానికి తెగబడ్డాడు. చైత్ర ఘటన మరువక ముందే గణేష్ నిమర్జనం లో మరో ఘటన బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే  జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీం పట్టణం  మండల పరిధిలోని  బల్లి పూర్ గ్రామంలో ఈ యొక్క ఘటన చోటుచేసుకుంది.

 సాయంత్రం సమయంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర లో  యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చిన 15 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 15 సంవత్సరాల బాలుడు  గ్రామంలోని మసీద్ వెంట తీసుకెళ్లి  చెట్ల పొదల్లో లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆ బాలిక అతన్నుంచి తప్పించుకుని వచ్చి  ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. వెంటనే వారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇలా తెలంగాణలో ప్రతి రోజు ఏదో ఒక మూలన ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో బయటకు వచ్చే వి వందలు 20 శాతం మాత్రమే అని చెప్పవచ్చు. చాలామంది ఇలాంటి ఘటనలు బయటకు చెప్పకుండా లోపలనే కవర్ చేసేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: