ఒక్క ముద్దు ఇస్తావా.. 25 వేలిస్తా.. ఏమంటావ్?

praveen
సమాజం మొత్తం నాగరికత వైపు అడుగులు వేస్తూ ఉంటే అటు మహిళలు  మాత్రం అడుగడుగునా వేధింపులకు గురవుతూనే ఉన్నారు. సభ్య సమాజంలో మానవత్వం మారుస్తున్న మనుషులు ఆడపిల్ల కనిపిస్తే చాలు మృగాలుగా మారిపోతున్నారు. మహిళా సాధికారత వైపు అడుగులు వేస్తున్న మహిళలను ఎక్కడికక్కడ వెనక్కి లాగుతూ సూటిపోటి మాటలతో వేధిస్తూనే ఉన్నారు. ఇలా ప్రతి చోటా మహిళ  వేధింపులకు గురవుతూనే ఉంది. కొంతమంది మహిళలపై అత్యాచారానికి పాల్పడుతూ ఉంటే మరికొంతమంది వేధింపులకు గురి చేస్తున్నారు.

 కొంతమంది సూటిపోటి మాటలతో  చిత్రహింసలకు గురి చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో మహిళ నేటి సమాజంలో ధైర్యంగా బ్రతకలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా మహిళ వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళను వేధిస్తున్న వారిని శిక్షించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా  కూడా మహిళలఫై వేధింపులు మాత్రం  ఆగడం లేదు. రోజురోజుకు మహిళల రక్షణ కాస్త ప్రశ్నార్థకంగా మారిపోతుంది. అయితే ఇటీవలే ఒక ఆర్ఎంపీ డాక్టర్ కి కూడా ఇలాంటి ఒక చేదు అనుభవం ఎదురైంది.  ఎంతో మందికి వైద్యం అందిస్తూ సేవ చేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్ పట్ల వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు.

 ఈ క్రమంలోనే సదరు వ్యక్తిపై పోలీసులు నిర్భయ కేసు తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. ఈ ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మొయినాబాద్ మండలంలోని ఓ గ్రామంలో దళిత మహిళ ఎంపీ క్లినిక్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు  ఇటీవలే సదరు ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు ఆరోగ్య సలహా కోసం ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి వచ్చాడు. ఈ సమయంలోనే  ఆర్ఎంపీ డాక్టర్ తో ఎంతో దారుణంగా ప్రవర్తించాడు. ఒక ముద్దు ఇస్తావా ఇరవై ఐదు వేలు ఇస్తాను ఐదు నెలలు క్లినిక్ అద్దె కూడా చెల్లిస్తాను అంటూ ఎంతో అసభ్యంగా మాట్లాడాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: