మరో చిన్నారి పై అత్యాచారం.. !

Veldandi Saikiran
మన దేశంలో మహిళలకు పూర్తి భద్రత కరువు అయింది. రోజుకో చోట మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం మరియు పోలీసు యంత్రాంగం ఇంత కఠినంగా వ్యవహరించినా... మహిళలపై దాడులు తగ్గటం లేదు. రోజు రోజుకు ఇలాంటి కేసులు పెరగడమే తప్ప...  ఎక్కడ తగ్గడం మాత్రం కనిపించడం లేదు. ఇక గత వారం రోజులుగా తెలంగాణవ్యాప్తంగా... చైత్ర అనే చిన్నారి ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన మరువక ముందే మరో దారుణ ఘటన చోటుచేసుకుంది.
జగిత్యాల జిల్లా లో మైనర్ బాలిక పై మరో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం పోలీసుల అదుపు లో నిందితుడు ఉన్నాడు.
ఆరేండ్ల బాలికపై జరిగిన హత్యాచారం ఘటన మరువక ముందే మరో ఐదేండ్ల బాలిక పై అత్యాచార ఘటన చోటు చేసుకుంది. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బాలిక ను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ సంఘటన బుధవారం జరుగ గా తాజాగా వెలుగు లోకి ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా తగు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇక ఈ ఘటన పై జగిత్యాల ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ..  ధర్మపురి మండలం లో  6 సంవత్సరం అమ్మాయి ని 18 ఏళ్ల అబ్బాయి అత్యాచారం చేశాడని పేర్కొన్నారు.
 
ఎస్ పాస్ 376 AB పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసామని.. నిందితుడిని కస్టడీ లోకి తీసుకున్నామని స్పష్టం చేశారు జగిత్యాల  ఎస్పీ సింధు శర్మ.  నిందితుడి బాలిక బందువు అని ఆమె వెల్లడించారు.  అండర్ 12 ఇయర్స్  కింద కేసు నమోదు చేసామని.. నిందితుడిని కఠినంగా శిక్షపడేలా ఆధారాలను సేకరిస్తామని పేర్కొన్నారు గిత్యాల ఎస్పీ సింధు శర్మ. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరా వృత్తం కాకుండా చూసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: