భార్యపై అనుమానం.. అవిటిదానిలా మార్చేసిన భర్త?

praveen
అనుమానం అనేది పెనుభూతం లాంటిది. ఒక్కసారి అనుమానం మొదలయిందంటే ఇక ఎన్నో దారుణమైన ఘటనలకు దారితీస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా భార్యా భర్తల మధ్య అనుమానం ఉంది అంటే ఇక దాంపత్య బంధం కాస్త ప్రతి క్షణం నరకం మారిపోతూ ఉంటుంది.  తరచూ గొడవలు జరగడం ఇక ఈ గొడవలు కాస్త దారుణాలకు దారి తీయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. ఇటీవలి కాలంలో ఇలా అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ అయిన భార్య భర్తల బంధం ఏకంగా అనుమానంతో దారుణాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతుంది. కట్టుకున్న భార్యపై అనుమానంతో ఎంతోమంది దారుణంగా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది  భార్య భర్తల బంధంలో అనుమానం అనే పెనుభూతం చిచ్చుపెట్టింది. దీంతో సాఫీగా సాగిపోతున్న సంసారంలో తరచూ గొడవలు జరగడం మొదలైంది. ఇక భర్తకు అనుమానం అంతకంతకూ పెరిగి పోవడంతో దారుణానికి పాల్పడ్డాడు. ఏకంగా కట్టుకున్న భార్య కాలు చేయి నరికేసి అవిటి దానిలా  మార్చేసాడు భర్త. ఈ దారుణ ఘటన కడప జిల్లాలో వెలుగులోకి వచ్చింది. చక్రాయపేట మండలం బిఎన్ తండాలో  ఉండే ఇస్లావత్ నాగ నాయక్ ఈశ్వరమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. ఇక వీరి సంసారం ఎంతో సాఫీగా సాగిపోతుంది. కానీ ఇటీవల భార్యపై అనుమానం పెంచు కోవడం మొదలుపెట్టాడు భర్త.

 తరచూ భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల భార్య తో మరోసారి గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో ఆవేశంతో ఊగిపోయినా భర్త నాగ నాయక్ భార్యపై కొడవలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఏకంగా కాలు చేయి నరికేశాడు. దీంతో కాల్ చేయి తెగి కింద పడిపోయాయి. ఇక గుర్తించిన బంధువులు వెంటనే బాధితురాలని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న భర్త కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: