లవ్ రిజెక్ట్ చేసిన యువతి.. పగబట్టి యువకుడు ఏం చేశాడో తెలుసా?

praveen
ఒకప్పుడు మహిళలను బానిసలుగా చూసేవారు.. కానీ ఇప్పుడు మాత్రం పురుషులతో సమానంగా మహిళలు కూడా సాధికారత సాధిస్తున్నారు. టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నారు అని చెబుతూ ఉంటారు  కొంతమంది. కానీ వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే మాత్రం మహిళల స్వేచ్ఛ రోజురోజుకు హరించుకుపోతుంది అన్నది అర్ధమవుతుంది.  మహిళ కనీసం సభ్యసమాజంలో ఒంటరిగా తిరగలేని పరిస్థితి నెలకొంది.  సాధికారత వైపు అడుగులు వేసేందుకు ప్రయత్నిస్తున్న మహిళకు అడుగడుగునా ఎన్నో ఇబ్బందులు ఎన్నో సవాళ్ళు.

 దీంతో మహిళ ఒక ప్రశ్నార్ధక జీవితాన్ని గడపవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా ఏకంగా అమ్మాయిల  వెంటపడుతున్న ఎంతోమంది ప్రేమోన్మాదులు ఇక యువతులు ప్రేమ అంగీకరించకపోతే దారుణాలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ప్రేమను తిరస్కరించింది అన్న కోపంతో యువతి పై పగ పెంచుకున్నాడు ఓ యువకుడు. ఈ క్రమంలోనే ఏకంగా సోషల్ మీడియా వేదికగా ఆమె పరువు తీశాడు. నల్గొండ జిల్లాకు  చెందిన దీపక్ కుమార్ అనే వ్యక్తి హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

 ఆ సమయంలో ఇక అతనికి ఒక యువతి తో పరిచయం ఏర్పడింది. ఇక ఆమెకు ఎంతో స్నేహం గా ఉన్నట్లు నటిస్తూనే ఇంస్టాగ్రామ్ యూజర్ ఐడి పాస్వర్డ్ తెలుసు కున్నాడు దీపక్. ఇక ఆ తర్వాత ఆ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంట పడ్డాడు. పెళ్లి చేసుకోవాలి అంటూ వేధించాడు. కానీ యువతీ మాత్రం అంగీకరించ లేదు. దీంతో ఆ యువతి పై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా పరువు తీయాలని నిర్ణయించుకుని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో అసభ్య చిత్రాలను అసభ్యకర మెసేజ్లు పోస్ట్ చేసి అందరికి పంపాడు  ఈ విషయాన్ని స్నేహితుల ద్వారా తెలుసుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: