భర్తతో గొడవ.. అదే అతనికి కలిసొచ్చింది.. చివరికి?

praveen
ప్రస్తుతం అందరూ టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్న సమయంలో కొంతమంది మాత్రం ఇంకా మాయలు మంత్రాలు అనే వాటిని నమ్ముతూ మోసపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ప్రజల మూఢనమ్మకాలను క్యాష్ చేసుకుంటున్న ఎంతోమంది కేటుగాళ్లు ప్రత్యేక పూజలు..  వ్రతాలు అంటూ భారీగా డబ్బులు గుంజుతున్నాడు  .  ఇలా రోజురోజుకు ఎన్నో ఘటనలు తెరమీదికి వస్తున్నప్పటికీ జనాల తీరులో మాత్రం మార్పు రావడంలేదు.  ముఖ్యంగా కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న జనాలు కేటుగాళ్ల వలలో సులభంగా పడిపోతున్నారు.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంతో సాఫీగా సాగిపోతున్న సంసారంలో భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం మొదలయ్యింది. దీంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇక భార్య భర్తల మధ్య జరుగుతున్న గొడవలనే ఓ కేటుగాడు తనకు ఆసరాగా చేసుకున్నాడు. విభేదాలను పరిష్కరిస్థానని.. దీని కోసం ప్రత్యేకమైన పూజలు చేయాలి అంటూ నమ్మబలికి  లక్షలాది రూపాయలను వసూలు చేశారు. ఈ ఘటన గుంటూరు అరండల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

 నగరానికి చెందిన విజయ ఆమె భర్త మధ్య గత కొంత కాలం నుంచి తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే విజయ కుమార్తె ద్వారా శ్రీధర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అయితే కుటుంబ గొడవలు తగ్గాలంటే ప్రత్యేక పూజలు చేయాలని దీనికోసం చాలా ఖర్చు అవుతుంది అంటూ మాయమాటలతో నమ్మించాడు. ఇలా ఏకంగా మాయ మాటలతో నమ్మించి 9లక్షల 60 వేల రూపాయలను వసూలు చేశాడు. అంతేకాదు బంగారు ఆభరణాలను కూడా లాక్కున్నాడు. పూజ మధ్యలో ఆపితే ప్రాణం పోతుందని భయ పెట్టి మరీ డబ్బులు లాక్కున్నాడు. ఇక ఆ తర్వాత మోసపోయామని గ్రహించిన భార్యాభర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్న పోలీసులు నగదు నగలు కూడా స్వాధీనం చేసుకుని బాధితులకు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: