తల్లి గొప్ప మనసు.. కూతురు వెన్నుపోటు?

praveen
నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే  మనిషి ఆలోచనా తీరు ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనుషుల్లో ఆ మానవత్వమే కనుమరుగై పోతుంటే.. సభ్యసమాజం ఉలికిపడే పరిస్థితి నెలకొంటుంది. ఇక్కడ ఏకంగా కూతురే తల్లిని దారుణంగా హత్య చేసింది. అది కూడా ప్రియుడి కోసం ఈ దారుణ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేస్తుంది. హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. ఆమెది ఈ దేశం కాదు.. ఇక్కడి మతం కూడా కాదు..  కానీ 30 ఏళ్లుగా ఆమె ఎంతో మంది అనాథలను అక్కున చేర్చుకుంటుంది.

 తల్లిదండ్రులు లేని చిన్నారులను తన పిల్లలుగా భావిస్తూ ఆలనాపాలనా చూసుకుంటుంది. కానీ ఆమెకు అప్పుడు తెలీదు అలా చేరదీసిన ఒక యువతి తనకు వెన్నుపోటు పొడుస్తుందని.. ఏకంగా ఇలా పాపం అంటూ చేరదీసిన ఓ చిన్నారి పెరిగి పెద్దయ్ చివరికి ఆమెకు వెన్నుపోటు పొడిచింది. ప్రియుడితో పెళ్లి కి వద్దన్నందుకు అడిగిన డబ్బు ఇవ్వనందుకు ఏకంగా పెంపుడు తల్లిని ప్రియుడి సహాయంతో దారుణంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళితే ఫ్రాన్స్ కి చెందిన మేరీ క్రీస్టీనా ఇద్దరు కుమార్తెల తో కలిసి మూడు దశాబ్దాల నుంచి హైదరాబాద్ లోనే ఉంటుంది. కుమార్తెలకు పెళ్లి కావడంతో అత్తారింటికి వెళ్లి పోయారు. అయితే ఒంటరిగా ఉంటున్న క్రీస్టీనా అనాధలైన రోమా, ప్రియాంక అనే ఇద్దరిని ఇంట్లో ఉంచుకుని పోషిస్తోంది. ఈ క్రమంలోనే రోమానీ కూడా సొంత కూతురిలా భావించి పెళ్లి చేయాలని అనుకుంది.

 కానీ అంతలోనే రోమా శ్రీరాములు అనే వ్యక్తితో ప్రేమలో పడింది. రోమా ప్రవర్తనపై అనుమానం వచ్చిన క్రీస్టీనా మందలించింది. తీరు మార్చుకోవాలి అంటూ హెచ్చరించింది. కానీ పెంపుడు తల్లి పై రోమా  కక్ష పెంచుకుంది.  రెండు లక్షలు ఇవ్వాలి అంటూ ఒత్తిడి తీసుకు వచ్చింది. కానీ ఆమె నిరాకరించడంతో చివరికి క్రీస్టీనాను హత్య చేయడానికి కూడా సిద్ధమైంది.  ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే ఏకంగా క్రీస్టీనాను  దారుణంగా హత్య చేసింది. ఇక ఆ తర్వాత ఆమె బ్యాంకు ఖాతా నుంచి రెండు లక్షలు కాచేసింది. అయితే ఇక తల్లి ఫోన్ స్విచాఫ్ రావడంతో అనుమానం వచ్చిన కూతురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: