అత్యాచారం.. అంతటితో ఆగని నీచులు.. చివరికి?
అత్యాచారం చేయడమే కాదు మహిళ మర్మంగాల్లోకి ఐరన్ రాడ్ లను కూడా జొప్పించి మృగాల కంటే దారుణంగా ప్రవర్తించారు. ఇక రక్తపు మడుగులో ఉన్న బాధితురాలిని పోలీసులకు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది ఆ మహిళ. ఈ ఘటన కాస్తా సంచలనంగా మారిపోయింది. ప్రస్తుతం బాధితురాలు వయసు 32 ఏళ్లు ఉంటుందని.. కామాంధులు ఆమెపై అత్యాచారం చేసిన తర్వాత అత్యంత అమానవీయంగా ఆమె మర్మాంగాలు లోకి ఐరన్ రాడ్లు చొప్పించి ఇక ఆ తర్వాత ఆమెను రోడ్డుపై పడేసి వెళ్లిపోయారని పోలీసులు చెబుతున్నారు.
పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయం లో బాధితురాలిని గుర్తించినట్లు తెలిపారు. ఇక వెంటనే చావు బతుకుల మధ్య ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. తెల్లవారు జామున మూడున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని ఇక రక్తపుమడుగులో మహిళ కొట్టుమిట్టాడుతూ ఉందని పోలీసులు చెప్పారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మోహన్ అనే 45 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.