దారుణం: ఆడుకోవడానికి వెళ్లి శవమైన బాలిక..!!

N.ANJI
నేటి సమాజంలో క్రైం రేట్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మూడు రోజుల క్రితం ఇంటి నుండి తప్పిపోయిన ఓ యువతీ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన హైదరాబాద్ శివారులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లో సైదాబాద్‌ సింగరేణి కాలనీలో నల్గొండ జిల్లా చందంపేట మండలానికి చెందిన ఓ కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చి ఆటో నడుపుతూ జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక వారి పెద్దమ్మాయి(5) రోజులాగానే ఆడుకునేందుకు బయటకు వచ్చింది. అయితే సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల మొత్తం వెతికారు.
చిన్నారి ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అయితే సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించినా ఫలితం లేకుండాపోయింది. ఇక వాళ్ల ఇంటి పక్కనే ఉంటున్న రాజు అనే వ్యక్తి చెడు వ్యసనాలకు అలవాటు పడి ల్లర దొంగతనాలు చేస్తుండేవాడు. అంతేకాక.. భార్య, పిల్లలను వేధింపులకు గురిచేయడంతో ఆమె కొద్దీ రోజుల క్రితం ఇంటి నుండి వెళ్ళిపోయింది. అతను రోజు కూలీ పనులు చేస్తూ ఆ డబ్బుతో రోజు మద్యం తాగుతుండేవాడు.
అయితే చిన్నారి నాయనమ్మ పక్కింట్లో ఉండే రాజుపై అనుమానం రావడంతో ప్రాంతంలో తాళం పగలగొట్టి చూశారు. కాగా వారికీ పరుపులో చిన్నారి శవమై కనిపించింది. కాగా.. ఆమె అత్యాచారం చేసి.. చివరకు హత్య చేసి శవాన్ని పరుపులో పెట్టి ఇంటి నుంచి పారిపోయినట్లు పోలీసులు అంచనాకి వచ్చారు. నిందితుడు బాలిక మృతదేహాన్ని పరుపులో మూట కట్టి ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారైనట్లు గుర్తించారు. దాంతో స్థానికుల్లో ఆగ్రహావేశాలకు లోనైయ్యారు. ఇక సైదాబాద్ సింగ‌రేణిలో హ‌త్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ శ‌ర్మ‌న్ శుక్ర‌వారం కలిశారు. ఈ సందర్భాంగా ఆయన మాట్లాడుతూ.. బాలిక కుటుంబంలోని మ‌రో ఇద్ద‌రు పిల్ల‌ల‌కు ఉచిత విద్య‌ను అందిస్తామ‌ని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: