హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
విదేశీ యువతుల కోసం కర్ణాటకలోని హుబ్లీ కేంద్రంగా.. ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ తయారు చేయిస్తున్నారు. దీంతో వీసా గడువు ముగిసినా విదేశీ యువతులు ఇక్కడే ఉండిపోతున్నారు. పోలీసుల అదుపులో ఉన్న మణికేష్ యాదవ్ సెల్ఫోన్లో.. వ్యభిచారానికి సంబంధించిన కీలక విషయాలను పోలీసులు గుర్తించారు. విదేశాల నుంచి వచ్చిన యువతలను గ్రేడింగ్ల వారీగా విభజించి మరీ చీకటి వ్యాపారం సాగిస్తున్నట్లు తేలింది. యువతలను యాపిల్, చెర్రీ, మ్యాంగో వంటి పేర్లు కలిగిన గ్రేడింగులు విభజించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. లావాదేవీలు కూడా బయటపడ్డాయి. మరోవైపు విదేశీ యువతులు ఒక్కో సిటీలోని ఖరీదైన హోటళ్లలో ఒకటి రెండు రోజులు మాత్రమే ఉంటారని తెలుస్తోంది. అయితే ఆ యువతులను ఎప్పుడు హైదరాబాద్కు తీసుకువచ్చే విషయం ప్రధాన నిర్వాహకుడికి మాత్రమే తెలుస్తుందట.
ఇక పట్టుబడిన విటుల్లో ప్రముఖులు, ధనవంతులు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు..కంపెనీల్లో కీలక హోదాల్లో ఉన్నవాళ్లు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది..! హైదరాబాద్కు చెందిన కొందరు ప్రముఖుల ఫోన్ నంబర్లు.. వాట్సాప్ చాటింగ్లను చూసి పోలీసులే షాకయ్యారు. హైటెక్ వ్యభిచారం వెనకాల పెద్ద వ్యవస్థే ఉందని అనుమానిస్తున్నారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని అన్ని కోణాల్లో వివరాలు రాబట్టాలని పోలీసులు యత్నిస్తున్నారు..!