వైన్ షాప్ కి వెళ్తే.. ప్రాణాల మీదికి వచ్చింది?

praveen
ఇటీవల కాలంలో మనుషులు మద్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మానవత్వం ఉన్న మనుషులు విచక్షణ కోల్పోయి దారుణంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. సాటి మనుషులు అని కూడా చూడకుండా మద్యం మత్తులో దాడులకు కూడా పాల్పడుతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో  ఉన్న మందుబాబులు అక్కడే పక్కనే మద్యం తాగుతున్న ఒక వ్యక్తిపై దారుణంగా దాడి చేసిన ఘటన ఇటీవలే హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.

 ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మంది తాగుబోతులు దేవేందర్ అనే యువకుడిపై బీర్ బాటిల్స్ తో దారుణంగా దాడి చేశారు. ఇక ఈ ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే..  నిన్న రాత్రి సమయంలో ఎల్బీనగర్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వరా వైన్ షాపులో బర్త్ డే పేరుతో అశోక్, అంజి, సాయి సహా మరికొంతమంది మందుబాబులు పార్టీ చేసుకున్నారు. అప్పటికే ఫుల్లుగా మద్యం తాగి ఉన్నారు. దీంతో రచ్చ రచ్చ చేయడం మొదలు పెట్టారు.  ఏకంగా బీరు సీసాలు పగలగొట్టడం మొదలుపెట్టారు.  ఈ క్రమంలోనే అశోక్ బీరు సీసాలు పగల గొడుతున్న సమయంలో పక్క టేబుల్ పై ఉన్న దేవేందర్ అనే యువకుడిపై బీరు సీసా ముక్క పడింది.

 దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు యువకుడు దేవేందర్. బీరు సీసా తనపై వచ్చి పడిందని ఇలా చేయడం ఏంటి అంటూ దేవేందర్ అశోక్ ని ప్రశ్నించాడు. ఇక దీంతో అప్పటికే ఫుల్లుగా మద్యం మత్తులో ఉన్న అశోక్ సహా అతని స్నేహితులు అందరూ మూకుమ్మడిగా దేవేందర్ పై దాడి చేయడం మొదలుపెట్టారు. ఏకంగా బీర్ సీసాలతో తలపై దారుణంగా కొట్టారు. అంతే కాదు కడుపులో బీరు సీసాలతో దాడి చేశారు. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ప్రస్తుతం బాధితుడు కామినేని ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైన్ షాప్ లో ఉన్న సీసీ కెమెరా లో దాడి దృశ్యాలు రికార్డు అయినప్పటికీ ఇంకా నిందితులను పోలీసులు అరెస్టు చేయకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: