కామంతో కళ్లు మూసుకుపోయాయ్.. భర్త పక్కన ఉండగానే?

praveen
ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా దారుణమైన శిక్షలు విధించిన కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. ఆడపిల్ల కనిపిస్తే చాలు కామంతో ఊగిపోయి దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే మొన్నటి వరకు ఒంటరిగా ఉన్న ఆడపిల్లలను చూస్తే చాలు కామాంధులు రెచ్చిపోయి అత్యాచారాలకు పాల్పడేవారు. మరికొంతమంది అంతటితో ఆగకుండా దారుణంగా హత్య చేయడం లాంటి ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో నేటి సభ్యసమాజంలో మహిళ ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది.

 కానీ.. ఇప్పుడు మాత్రం ఏకంగా ఒంటరిగా ఉన్న మహిళపై కాదు పక్కన కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ కామాంధులు వెనకడుగు వేయడం లేదు. రెచ్చిపోయి మరి అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో పక్కన అన్న, భర్త, తండ్రి ఇలా ఎవరు ఉన్నా సరే ఆడపిల్లలకు మాత్రం రక్షణ ఉండటం లేదు అని చెప్పాలి. ఏకంగా పక్కన ఉన్న వారిని కొట్టి ఆడపిల్లలపై అత్యాచారం చేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవలే గుంటూరు జిల్లాలో బుధవారం రాత్రి సమయంలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సత్తనపల్లి మండలానికి  చెందిన దంపతులు గుంటూరు నగరంలో ఓ వివాహానికి హాజరై బైక్ ఫై వస్తున్నారు.

 ఇక బైక్ పై వస్తున్న భార్యాభర్తలను కొందరు దుండగులు అడ్డగించి భర్తపై దారుణంగా దాడి చేశారు. అనంతరం సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  ఇక వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితులు వెంటనే సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇక బాధితుల ఫిర్యాదు చేసినప్పటికీ గుంటూరు అర్బన్ ఎస్పీ పరిధిలోకి వస్తుందని తమ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తీసుకోము అంటూ చెప్పడంతో బాధితులు నిరాశతో వెనుదిరిగారు. ఇలా ఆపదలో వస్తే ప్రజలకు ధైర్యం చెప్పి ఫిర్యాదు తీసుకోకుండా పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: