వదినపై దాడికి దిగిన మరిది.. చివరకి..?

N.ANJI
సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. రోజురోజుకు దేశంలో క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంది. క్షణికావేశంతో చిన్న చిన్న కారణాలకే ప్రాణాలను తీస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి సొంత వదినను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఓ విషయంలో వారి మధ్య మొదలైన గొడవ చివరకు ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలోనే నిందితుడు చేతిలో పదునైన ఆయుధంతో అతడి వదినపై దాడి చేశాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన హర్యానాలోని అంబాల నగరంలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అంబల కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డేహ కాలనీలో సప్న అనే మహిళ నివాసం ఉంటుంది. గురువారం సాయంత్రం సప్న భర్త తమ్ముడు ధీరజ్.. పిల్లలకు సంబంధించిన తగాదాపై ఆమెపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. దీంతో ఆమె వెంటనే స్పృహ కోల్పోయింది. దీంతో సప్న భర్త అనిల్ వెంటనే ఆమెను అంబాల కంటోన్మెంట్‌లోని సివిల్ ఆస్పత్రికి తరలించాడు. అయితే సప్న చనిపోయినట్టుగా వైద్యులు ప్రకటించారు.
అయితే ఈ ఘటనపై సప్న భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సప్న, ధీరజ్‌ల మధ్య పిల్లలకు సంబంధించి తరుచూ గొడవ జరిగేదని పేర్కొన్నాడు. ‘గురువారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో మా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ధీరజ్ పిల్లలు మామిడి పిక్కను ఇంటివైపు విసిరారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు ధీరజ్, అతని భార్య సప్నను తిట్టడం మొదలుపెట్టారు.
ఇక ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరగటంతో దాడి కూడా చేశారు. ఒక్కసారిగా ధీరజ్ సప్న తలపై చేతిలో పదునైన ఆయుధంతో కొట్టాడు. దీంతో ఆమె చనిపోయింది’అని తెలిపాడు. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ధీరజ్, అతని భార్యపై ఐపీసీ సెక్షన్‌లు 302, 323, 34ల కింద కేసు నమోదు చేసున్నారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతుందని.. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: