ప్రాణం మీదికి తెచ్చిన చైనా మాంజా.. తస్మాత్ జాగ్రత్త?

praveen
సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు అంబరాన్ని అంటిపోతుంటాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా రంగురంగుల రంగవల్లులు సాంప్రదాయ వస్త్రధారణలో యువత కనువిందు  చేస్తూ ఉంటారు. అంతేకాదు ఇక కోడిపందాలు కూడా సందడి చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే సంక్రాంతి వచ్చిందంటే ఇవి మాత్రమే కాదు ఎంతోమంది గాలిపటాలను ఎగరవేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఒకప్పుడు కేవలం సరదా కోసం మాత్రమే గాలిపటాలను ఎగురవేయడం లాంటివి చేసేవారు.

 కానీ ఇప్పుడు మాత్రం గాలిపటాల తో పోటీలు పడుతూ ఉండడం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఏకంగా చైనా మాంజాలను తీసుకువచ్చి గాలిపటాలకు కట్టి ఇక గాల్లోనే పోటీ వేసి చివరికి ప్రత్యర్ధులను ఓడించి సంతోషపడటం కనిపిస్తుంది. కానీ ఇలా ఏకంగా గాలిపటాలు ఎగరవేయడంలో సంతోషాన్ని పంచే చైనా మాంజాలు కొన్ని కొన్ని సార్లు ఏకంగా ప్రాణాలను కూడా తీసేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇప్పటికే ఇలా చైనా మాంజా కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా వెలుగు లోకి వచ్చాయి. ఇటీవల కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఏకంగా పండగ వేల చైనా మాంజా ఓ ఇంట విషాదాన్ని నింపింది. హైదరాబాద్ లోని నాగోల్ ఫ్లైఓవర్ నుంచి బైక్ పై వెళ్తున్న కుటుంబాన్ని చైనామంజా రూపం లో మృత్యువు కబళించ బోయింది అని చెప్పాలి. ఏకంగా ఒక కుటుంబానికి పతంగులు ఎగరవేసే చైనా మాంజ చుట్టుకుంది. దీంతో తండ్రితో పాటు నాలుగేళ్ల చిన్నారి మెడ ను మాంజా కోసేసింది. కాగా కుటుంబ సభ్యులందరికీ తీవ్ర గాయాలు అయ్యాయి.. ఇక వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు అని చెప్పాలి. అయితే నాలుగేళ్ల చిన్నారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: