ఇంట్లో నుంచి దుర్వాసన.. ఏంటా అని స్థానికులు వెళ్లి చూస్తే షాక్?

praveen
అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత చావు ఎప్పుడు ఎవరిని కబలిస్తుంది అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే అయినవాళ్లను  దూరం చేసి పుట్టడు దుఃఖాన్ని మిగులుస్తూ ఉంటుంది విధి. ఈ క్రమంలోనే ఇక అప్పటివరకు తమ ముందే ఉన్నవారు ఇక లేరు అన్న విషయాన్ని చాలామంది జీవించుకోలేరు. ఈ క్రమంలోనే తమ ఆప్తులు మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు.

 ఇక ఈ పిచ్చి ప్రేమతోనే కొంతమంది మూఢనమ్మకాల వైపు కూడా అడుగులు వేస్తూ చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. చనిపోయిన వారు మళ్ళీ తిరిగి రారు అని తెలిసినప్పటికీ కూడా విచిత్రంగా  ప్రవర్తించడం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఓ మహిళ చనిపోగా కుటుంబ సభ్యులందరూ కూడా ఆమె మృతదేహం వద్ద తిరిగి ప్రాణం పోయాలని ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. రోజులు గడుస్తున్న ఆమెకు మాత్రం ప్రాణం రాలేదు కానీ ఇక ఆమె శరీరం మాత్రం కుల్లిపోయే పరిస్థితికి చేరుకుంది. దీంతో దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు.. ఇక ఏంటా అని పోలీసులు వెళ్లి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు.

 ఈ ఘటన తమిళనాడులోని మదురై ఎన్ఎస్ కాలనీలో వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణన్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే అతనికి భార్య మాలతి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఇటీవలే మాలతి మృతి చెందింది. దీంతో కుటుంబం మొత్తం పుట్టేడు  దుఃఖంలో మునిగిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ బ్రతికించాలని కుటుంబం నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే శవాన్ని ఫ్రీజర్ బాక్స్ లో పెట్టి ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. కానీ దుర్వాసన రావడంతో స్థానికులు కంగారు పడిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.. ఇక అక్కడికి చేరుకున్న పోలీసుల వెంట లోపలికి వెళ్లి చూసిన స్థానికులు షాక్ అయ్యారు. ఇక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం  ఆసుపత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: