కళియుగ "కీచకుడు": 17 ఏళ్ళ అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి 'సహజీవనం' !

VAMSI
ప్రతి రోజూ ప్రపంచం నలువైపులా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను, హత్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాము. వీరిలో చాలా వరకు నిందితులైన వారిని పట్టుకుని శిక్షలు విధిస్తోంది పోలీస్ శాఖ . అయినా తమ తీరు మారాడని ఎప్పటికప్పుడు కొందరు మృగాళ్లు ప్రూవ్ చేసుకుంటున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఒక దురాగతం ఈ సమాజంలో స్త్రీలకు సంరక్షణ లేదని తెలుపుతోంది. ఇంతకీ అసలు ఏమి జరిగిందో ఇప్పుడు చూద్దాం. కన్యాకుమారి జిల్లా కట్టతురై కుట్టకులై ప్రాంతంలో విను అనే ప్లంబర్ జీవిస్తున్నాడు. ఇతనికి దాదాపుగా 22 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పటికే వినుకి వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
అయితే తన విచక్షణ కోల్పోయి పెళ్ళాం ఉన్నా సరే ఒక ప్లస్ 2 చదివే అమ్మాయిని తన మాయమాటలతో నమ్మించి ప్రేమించాడు. ఇక్కడితో ఆగాడా అంటే... మనోడికి ఇంకొక అమ్మాయి కావాల్సి వచ్చింది. తన లవర్ ఫ్రెండ్ ను కూడా ఎలాగోలా వలలో వేసుకున్నాడు. అలా పెళ్ళైనా... ఇద్దరు కాలేజీ అమ్మాయిల ప్రేమలో ఉన్నాడు. ఒకేచోట ఉంటే తన చేష్టలు సాగవని పక్కా ప్లాన్ తో ఇద్దరి అమ్మాయిలను కిడ్నాప్ చేసి తిరువణ్ణామలై లోని ఒక ఇంట్లో బంధించాడు. ఎవ్వరికీ తెలియకుండా ఇద్దరితోనూ సహజీవనం చేయడం స్టార్ట్ చేశాడు.
కానీ ఏ తప్పు అయినా ఎక్కువ కాలం దాగదు. తమ పిల్లలు కనబడలేదని తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసు బృందం తిరువణ్ణామలై లోని ఇంట్లో కాపురం చేస్తున్న విను ను అరెస్ట్ చేసి  ఆ ఇద్దరు అమ్మాయిలను అతని బారి నుండి కాపాడి తల్లితండ్రులకు అప్పగించారు. ఈ విషయం తెలిసిన పలువురు అతనిని కళియుగ కీచకుడు అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు.. వారి పాపం పండినప్పుడే ఇలాంటివి బయటకు వస్తుంటాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: