అయ్యబాబోయ్.. కిడ్నాప్ చేసిన పోలీసులు.. ఇంతకీ ఎవరినో తెలుసా?
అంతే కాకుండా కొన్ని ప్రాంతాలలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ద్వారా అటు ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు పోలీస్ అధికారులు. ఈ క్రమంలోనే ప్రజలందరికీ కూడా పోలీస్ లపై ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఇలాంటి సమయంలో కొంతమంది పోలీసులు మాత్రం చేస్తున్న పనులు ఖాకి చొక్కాకే మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయి అని చెప్పాలి. నేరాలను అరికట్టాల్సిన పోలీసులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎన్నో నేరాలు చేసి చివరికి వార్తల్లో నిలుస్తున్నారు ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.
సాధారణం గా ఎవరినైనా కిడ్నాప్ చేస్తే పోలీసులు ఆ కేసును ఎంతో చాకచక్యం గా ఛేదించడం మాత్రమే ఇప్పటివరకు చూసాం. కానీ ఇక్కడ పోలీసులు మాత్రం కిడ్నాప్ కి పాల్పడ్డారు. ఢిల్లీలో టాక్స్ ఏజెంట్గా పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులను కిడ్నాప్ చేశారు. విడుదల చేయాలంటే ఐదు లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ కూడా చేశారు. లేదంటే తప్పుడు కేసులు బనాయిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే బాధితుడు వద్ద ఉన్న 35000 లాక్కోవడమే కాదు.. ఇక అకౌంట్ ద్వారా 75000 ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. తర్వాత కిడ్నాపర్ల బారి నుంచి తప్పించుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది.