ఓకే యువతిపై మనసు పడ్డ ఇద్దరు స్నేహితులు.. చివరికి?
ఇక్కడ ప్రేమ కారణంగా ఏకంగా ఓ యువతి బలి అయ్యింది. మచిలీపట్నంలోని కోనేరు సెంటర్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకులు కూడా ఒకే అమ్మాయిని ప్రేమించారు. ఇక ఈ ప్రేమ చివరికి హత్య చేసేందుకు కూడా సిద్ధం అయ్యే పరిస్థితిని తీసుకువచ్చింది. మచిలీపట్నంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన నాగేంద్రకుమార్, నాగేశ్వరరావు స్నేహితులు. ఇద్దరూ కూడా రోల్డ్ గోల్డ్ పనులు చేస్తూ ఉంటారు. ఇద్దరు స్నేహితులు ఒక యువతి పై మనసు పరేసుకున్నారు. సదరు యువతి కొన్నాళ్ళు నాగేశ్వరరావు తో ఎంతో చనువుగా ఉంది. కానీ ఆ తర్వాత మాత్రం నాగేంద్ర కుమార్ తో మాట్లాడుతూ నాగేశ్వరరావును దూరం పెడుతూ వచ్చింది.
దీంతో పగ పెంచుకున్న నాగేశ్వరరావు స్నేహితుడు నాగేంద్రకుమార్ ను అంతమొందించాలి అని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే దుకాణంలో పటాస్ ముక్క కొనుగోలు చేశాడు. తెల్లవారుజామున నాగేంద్రకుమార్ బాత్ రూమ్ లో ఉన్న బ్రెష్ పై నాగేశ్వరావు పటాస్ కలిపిన పేస్టును పెట్టి వెళ్ళిపోయాడు. అయితే తన తమ్ముడు నాగేంద్ర కుమార్ ని చంపేందుకు నాగేశ్వరరావు ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న సోదరుడు నాగేశ్వరరావు పెట్టిన బ్రష్ ని అక్కడి నుంచి తొలగించాడు. కొన్ని రోజుల తర్వాత ఈ విషయం ఆ నోట ఈ నోట పడి బయటికి పొక్కింది. నాగేంద్ర కుమార్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. పోలీసులు నాగేశ్వరరావును అరెస్టు చేసి విచారించారు.