చనిపోయిన కొడుకు బ్రతికొస్తాడని అలా చేశారు.. కానీ చివరికి

praveen
ఇటీవలి కాలం లో ఎవరికి ఎలా మరణం సంభవిస్తుంది అన్నది చెప్పలేని విధంగానే ఉంటుంది. అందరూ సంతోషం గా ఉన్నాం అనుకుంటున్నా సమయం లో కేవలం నిమిషాల వ్యవధి లోనే మృత్యువు దూసుకు వచ్చి ఏకంగా కానరాని లోకాలకు తీసుకు వెళ్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వెరసి ఎన్నో కుటుంబాలు శోకసంద్రంలో మునిగి పోతు అరణ్యరోదనగా విలపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్నారులు సైతం మృత్యువు ఒడిలోకి చేరిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అదేసమయంలో నేటి ఆధునిక సమాజంలో కూడా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి అని చెప్పాలి.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. చిన్నప్పటి నుంచి కొడుకు కి ఏ కష్టం రాకుండా అల్లారుముద్దుగా చూసుకున్నారు. ఇక కుటుంబం మొత్తం వచ్చిన దాంట్లో సర్దుకుపోతూ ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే వారి కుటుంబం మీద విధి చిన్నచూపు చూసింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు ప్రాణాలు తీసింది. ఈతకు వెళ్లి నీటిలో మునిగి పోయిన బాలుడు చివరికి  కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ విషయం తెలిసి ఆ తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది. అరణ్యరోదనగా విలపించారు.

 అయితే ఉప్పు పాతర వేస్తే బాలుడు బ్రతికి వస్తాడని ఎవరో ఆ తల్లిదండ్రులకు చెప్పారు.  దీంతో కొడుకు బ్రతుకుతాడేమో అనే చిన్న ఆశ వారు మూఢనమ్మకాలు నమ్మేలా చేసింది. ఈ క్రమంలోనే బాలుడి మృతదేహంపై ఐదు బస్తాల ఉప్పు పోశారు. కానీ కొడుకు మాత్రం తిరిగి రాలేదు.  ఈ ఘటన కర్ణాటకలోని బళ్లారి జిల్లా సిరివారలో వెలుగులోకి వచ్చింది. బాలుడు మృతదేహంపై ఉప్పు పోసి   ఎనిమిది గంటలు ఎదురుచూశారు తల్లిదండ్రులు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకొని తల్లిదండ్రులతో చర్చించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారి పోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: