ఇంట్లో నగ్నంగా తల్లీకూతుళ్ల మృతదేహాలు.. 10రోజులు తర్వాత?
ఇటీవలే ఉత్తరప్రదేశ్ లో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఇక్కడ జరిగిన ఘటన స్థానికంగా అందరినీ ఒక్క సారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఓ ఇంట్లో తల్లీకూతుళ్ల మృతదేహాలు అర్థనగ్నంగా పడి ఉండడం సంచలనంగా మారింది. ఆ తర్వాత కొడుకు 10 రోజుల తర్వాత ఇంటికి రావడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా ఆలస్యంగానే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి నారియా కు చెందిన సునీతా పాండే అనే మహిళకు ఇద్దరు కుమారులు దీపిక పాండే అనే కుమార్తె ఉన్నారు. ఇక ఈమె భర్త బలముకుంద రిటైర్డ్ విద్యుత్ శాఖ ఉద్యోగి. రెండేళ్ల క్రితమే ఆయన మరణించారు. ఇక పెద్ద కుమారుడు అఖిలేష్ అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తుండగా చిన్న కుమారుడు ఆంజనేయులు పౌల్ట్రీ ఫామ్ హౌస్ లో పని చేస్తున్నాడు. అయితే ఇటీవలే ఆంజనేయులు పది రోజుల తర్వాత సొంతూరికి వచ్చాడు. ఇంట్లోకి వెళ్లి తల్లి చెల్లి మృతదేహాలు అర్థనగ్నంగా ఉండడం చూసి షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మిస్టరీని ఛేదించారు. అదే ప్రాంతానికి చెందిన అతుల్, అమన్ తల్లీకూతుళ్లను దారుణంగా హత్య చేసినట్లు బంగారు ఆభరణాలు లాక్కెళ్లినట్లు తెలిసింది. దీంతో వారిని అరెస్టు చేశారు పోలీసులు.