నదిలో దూకిన ఇద్దరు విద్యార్థినులు.. సూసైడ్ నోట్లో ఏం రాసుందో తెలుసా?
ఇక ఇటీవలే బెంగుళూరు లో కూడా ఇలాంటి ఘటన వెలుగు లోకి వచ్చింది అని చెప్పాలి. ఇద్దరు కాలేజీ విద్యార్థునులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కాలేజి అయిపోయాక తిరిగి ఇంటికి బయలుదేరిన విద్యార్థులు కాలువ లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరు మృతిచెందగా మరొకరు గల్లంతయ్యారు. మొగలూరు గ్రామం వద్ద చోటు చేసుకుంది ఈ ఘటన. అయితే మృతురాలు బెంగళూరు రూరల్ జిల్లా హోసకోట తాలూకా గ్రామానికి చెందిన రాజేశ్వరిగా గుర్తించారు పోలీసులు. మరో విద్యార్థి సుప్రియ అని తేల్చారు.
అయితే సుప్రియ, రాజేశ్వరి లూ చదువులో ఎప్పుడూ ముందుండే వారు. ఎప్పటిలాగానే కళాశాలకు వెళ్లి ఇంటికి వస్తున్న సమయంలో ఇక మార్గమధ్యంలో ఉన్న కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలోనే మన పెళ్లి కి ఎవరూ అంగీకరించేది లేదు నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు.. అంటూ సుప్రియ రాసిన ఒక సూసైడ్ నోట్ ప్రస్తుతం లభించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకుని అయ్యో ఇలా జరిగింది ఏంటి దేవుడా అంటూ అరణ్యరోదనగా పెంచారు