నదిలో దూకిన ఇద్దరు విద్యార్థినులు.. సూసైడ్ నోట్లో ఏం రాసుందో తెలుసా?

praveen
ఇటీవలి కాలం లో ఎంతో మంది విద్యార్థులు చదువుకుంటున్న సమయం లోనే కఠిన నిర్ణయాలు తీసుకుంటూ తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు లోకి వస్తున్నాయి పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని.. స్నేహితుల తో గొడవ జరిగిందని.. టీచర్లు మందలించారని చిన్నచిన్న కారణాలకే విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. మరోవైపు లేత వయసు లోనే పుడుతున్న ప్రయాణికులు కూడా విద్యార్థులు ఉసురు తీసుకుంటూ ఉన్నాయి. ప్రేమను పెద్దలు అంగీకరిస్తారో లేదన్న కారణం తో భయపడి పోయి చివరికి విద్యార్థులు ప్రాణాలను బలవంతంగా తీసుకుంటున్నారు.

 ఇక ఇటీవలే బెంగుళూరు లో కూడా ఇలాంటి ఘటన వెలుగు లోకి వచ్చింది అని చెప్పాలి. ఇద్దరు కాలేజీ విద్యార్థునులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కాలేజి అయిపోయాక తిరిగి ఇంటికి బయలుదేరిన విద్యార్థులు కాలువ లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరు మృతిచెందగా మరొకరు గల్లంతయ్యారు. మొగలూరు గ్రామం వద్ద చోటు చేసుకుంది ఈ ఘటన. అయితే మృతురాలు బెంగళూరు రూరల్ జిల్లా హోసకోట తాలూకా గ్రామానికి చెందిన రాజేశ్వరిగా  గుర్తించారు పోలీసులు. మరో విద్యార్థి సుప్రియ అని తేల్చారు.
 అయితే సుప్రియ, రాజేశ్వరి లూ చదువులో ఎప్పుడూ ముందుండే వారు. ఎప్పటిలాగానే కళాశాలకు వెళ్లి ఇంటికి వస్తున్న సమయంలో ఇక మార్గమధ్యంలో ఉన్న కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలోనే మన పెళ్లి కి ఎవరూ అంగీకరించేది లేదు నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు.. అంటూ సుప్రియ రాసిన ఒక సూసైడ్ నోట్ ప్రస్తుతం లభించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకుని అయ్యో ఇలా జరిగింది ఏంటి దేవుడా అంటూ అరణ్యరోదనగా పెంచారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: